TDP: పామర్రు ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబు..
ABN, Publish Date - Apr 08 , 2024 | 11:12 AM
ప్రజాగళం యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు లేకుంటే కృష్ణా డెల్టా ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. అందుకే 2014లో తాము అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని.. అది పూర్తయ్యేలోపు డెల్టాకు సకాలంలో నీరివ్వాలనే ఆలోచనతో పట్టిసీమను కట్టామని తెలిపారు. కానీ ఓ దుర్మార్గుడు (జగన్) అధికారం చేజిక్కించుకుని పోలవరం ఆపేశాడని, కాల్వల్లో కన్నీరు పారిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులపై గోతులను పూడ్చలేని వ్యక్తి రాష్ట్రంలో మూడు రాజధానుల కడతానని చెబుతున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
Updated at - Apr 08 , 2024 | 11:14 AM