Share News

NRI: త్వరలో గల్ఫ్ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:05 PM

గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ గల్ఫ్ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి బృందం కృతజ్ఞతలు తెలిపింది.

NRI: త్వరలో గల్ఫ్ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

  • గల్ఫ్ మృతులకు ఎక్స్ గ్రేషియా ఇచ్చిన సీఎంకు కృతజ్ఞత తెలిపిన గల్ఫ్ జెఏసీ బృందం 

  • నెలాఖరున గల్ఫ్ దేశాల్లో పర్యటించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు 

గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలస కార్మికుల (NRI) కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి తెలంగాణ గల్ఫ్ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి (గల్ఫ్ జెఏసి) బృందం కృతజ్ఞతలు తెలిపింది. గల్ఫ్ హామీల అమలుకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే శ్రీకారం చుట్టడం అభినందనీయమని ఎన్నారైలు అన్నారు. 

బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డా. బీఎం వినోద్ కుమార్, గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, ఖతర్ ఎన్నారై దాసరిపల్లి మిథిల, టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్ వలసల విశ్లేషకులు మంద భీంరెడ్డి బుధవారం సీఎంను కలిసారు. 

TDP Foundation Day: కువైట్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. మిన్నంటిన తెలుగు తమ్ముళ్ల సంబరాలు


ఈ సందర్భంగా డా. బీఎం వినోద్ కుమార్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి మానవత్వంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. సమగ్ర ఎన్నారై పాలసీ, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అన్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 15 తర్వాత గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సీఎం ఎ. రేవంత్ రెడ్డి సమావేశం అవుతారని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ నెలాఖరుకు గల్ఫ్ దేశాలలో పర్యటిస్తారని ఆయన అన్నారు. 

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2024 | 04:08 PM