Share News

TDP Foundation Day: కువైట్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. మిన్నంటిన తెలుగు తమ్ముళ్ల సంబరాలు

ABN , Publish Date - Mar 30 , 2024 | 08:49 PM

ఎన్నారై తెలుగుదేశం కువైట్, జనసేన కువైట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు.

TDP Foundation Day: కువైట్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. మిన్నంటిన తెలుగు తమ్ముళ్ల సంబరాలు

ఎన్నారై డెస్క్: ఎన్నారై (NRI) తెలుగుదేశం కువైట్, జనసేన కువైట్ (Kuwait) ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ (TDP) 42వ ఆవిర్భావ దినోత్సవం (TDP Foundation Day) వైభవంగా జరిగింది. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని కువైట్‌లో నివసిస్తున్న తెలుగు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు అధ్యక్షతన ఎన్నారై తెలుగుదేశం పార్టీ కువైట్ అధ్యక్షులు మద్దిన ఈశ్వర్ నాయుడు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

TDP: ఖతర్‌లో వైభవంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం

2.jpg


కుదరవల్లి సుధాకర రావు మాట్లడుతూ అన్న నందమూరి తారక రామారావు 1982లో సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదల కోసం పెట్టిన పార్టీ టీడీపీ అని అన్నారు. అలాంటి పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసం శుక్రవారం రోజున, క్రైస్తవ సోదరుల ప్రముఖ పండుగ గుడ్ ఫైడే రోజున చేసుకోవటం చాలా సంతోషమని అన్నారు. మద్దిన ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ త్వరలో మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో వీలైనవారందరూ పాల్గొని ఎన్.డి.యె. కూటమిని గెలిపించాలని, ఎవరైనా కొందరు ఎన్నికలకు వెళ్ళలేకపోతే వారు వాళ్ళ కుటుంభసభ్యులను, స్నేహితులను, చుట్టాలను ప్రభావితంచేసి కూటమి అభ్యర్ధులను గెలిపించటానికి తమవంతు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు.

4.jpg


జనసేన గల్ఫ్ జాతీయ కన్వీనర్లు రామచంద్ర నాయక్, కాంచన శ్రీకాంత్ బాబు మాట్లాడుతూ మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపించి సైకో పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఒక దుర్మార్గుడి కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిందని, నకిలీ మద్యం, ఇసుక మాఫియా, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని, వీటి నుండి కాపాడాలంటే ఎన్డీయే కూటమిని గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకులు ములకల సుబ్బారాయుడు మాట్లాడుతూ అభివృద్ధి కావాలన్నా, రాష్ట్ర రాజధాని కావాలన్నా, పరిశ్రమలు, ఐటి కంపెనీలు రావాలన్నా ఎన్డీయే కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నారై తెలుగుదేశం పార్టీ కువైట్ ఉపాధ్యక్షులు షేక్ బాషా..కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. చివరిగా కేక్ కట్ చేసి ఇఫ్తార్ విందుతో కార్యక్రమాన్ని ముగించారు.

1.jpg


ఈ కార్యక్రమానికి ఎన్నారై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ములకల సుబ్బారాయుడు, గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి, ఎన్నారై తెలుగుదేశం పార్టీ కువైట్ ఉపాధ్యక్షులు షేక్ బాషా, కోశాధికారి ఎనుగొండ నరసింహ, సోషల్ మీడియా ఇంచార్జి వి.సి.సుబ్బారెడ్డి, గవర్నరేట్ కోఆర్డినేటర్స్ ఈడుపుగంటి దుర్గా ప్రసాద్, పెంచల్ రెడ్డి, కుటుంబరావు, ముస్తాక్ ఖాన్, ముఖ్యనాయకులు పోలారపు బాబు నాయుడు, ములకల రవి, పద్మరాజు వేణు, శివ మద్దిపట్ల, నరేష్ సన్నపనేని, పెంచల్ సన్నపనేని మొదలగు వారు, జనసేన నాయకులు గల్ఫ్ జాతీయ కన్వీనర్ కాంచన శ్రీకాంత్ బాబు, రామచంద్ర నాయక్, కువైట్ కన్వీనర్ ఆకుల రాజేష్, ఇమ్మిడిశెట్టి సూర్యనారయణ, వేణు, ఓబులేష్, చంద్రశేఖర్, తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 09:20 PM