Share News

NRI: గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ABN , Publish Date - Jan 09 , 2024 | 10:39 PM

గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ ఎన్నికల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాలకి చెందిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌‌ గణేష్ కందుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు...

NRI: గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఎన్నారై డెస్క్: గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ ఎన్నికల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాలకి చెందిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌‌ గణేష్ కందుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన కార్యవర్గానికి ఈ రోజు ఎన్నికలు జరిగాయి. వైస్ ప్రెసిడెంట్‌గా ప్రశాంత్ జీవన్ యేనుగ, కార్యదర్శి గా హరీష్ బొడ్డున, కోశాధికారిగా సురేష్ రుద్రరాజు , సాంస్కృతిక కార్యదర్శిగా బాలకృష్ణ గరిపల్లి భారీ మెజారిటీ తో గెలిచారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రెసిడెంట్‌ గణేష్.. రిచ్మండ్ తెలుగు కమ్యూనిటీ లో సర్వీసెస్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారని అసోషియేషన్ సభ్యులు తెలిపారు.

nri-viral.jpgnri3.jpg

అసోసియేషన్ ప్రెసిడెంట్‌‌ గణేష్ మాట్లాడుతూ తన సొంత నిధులతో ఖమ్మం లో కాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు, నిరుపేదలకు దుప్పట్లు , కరోనా సమయంలో నిత్యావసర సరుకులు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. తమపై నమ్మకంతో ఈ అవకాశం రిచ్మండ్ తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. అందరినీ కలుపుకుని సంస్థ అభ్యున్యతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన అసోసియేషన్ సభ్యులకీ పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.

Updated Date - Jan 09 , 2024 | 10:39 PM