Share News

Bengaluru CEO: టిష్యూ మీద ఐ లైనర్‌తో నోట్.. ఫోరెన్సిక్‌ బృందానికి లేఖ

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:54 AM

స్టార్టప్ సీఈవో సుచనా సేథ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. లేఖ పేజీపై రాయకుండా టిష్యూ మీద రాసింది. పెన్ను స్థానంలో ఐ లైనర్ వాడిందని పోలీసులు చెబుతున్నారు.

 Bengaluru CEO: టిష్యూ మీద ఐ లైనర్‌తో నోట్.. ఫోరెన్సిక్‌ బృందానికి లేఖ

బెంగళూర్: బెంగళూర్‌కు చెందిన స్టార్టప్ సీఈవో సుచనా సేథ్ (Suchana Seth) కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. ఆమె రాసిన లేఖను గోవా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లేఖ పేజీపై రాయకుండా టిష్యూ మీద రాసింది సుజనా సేథ్ (Suchana Seth). పెన్ను స్థానంలో ఐ లైనర్ (Eyeliner) వాడిందని పోలీసులు చెబుతున్నారు. ఏం రాసిందో తెలియడం లేదని, ఫోరెన్సిక్ బృందానికి పంపించామని వెల్లడించారు. టిష్యూ (Tissue) మీద రాసిన లేఖను ఫోరెన్సిక్ బృందంలో చేతిరాత నిపుణుడు పరిశీలిస్తారు.

సుచనా సేథ్- వెంకట్ రామన్ దంపతులకు కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. దంపతులకు కోర్టు విడాకులు కూడా మంజూరు చేసింది. వారంలో ఒకరోజు తండ్రి కుమారుడిని కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ విషయం సుచనాకు ఎంతమాత్రం నచ్చలేదు. ఆదివారం తండ్రి వద్దకు కుమారుడిని పంపించేందుకు ఇష్టపడలేదు. అందుకోసమే కన్న కొడుకును దారుణంగా హత్య చేసింది. సుచనా సేథ్ మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు చెబుతున్నారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 12 , 2024 | 11:01 AM