Share News

Swathi Mishra: రామ్ ఆయేంగే సింగర్ స్వాతి మిశ్రా ఎవరో మీకు తెలుసా..

ABN , Publish Date - Jan 08 , 2024 | 04:01 PM

రామ్ ఆయేంగే భజన్ ఎంతగా ఫేమస్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ప్రధాని మోదీ సైతం ఈ పాట పాడిన స్వాతి మిశ్రా

Swathi Mishra: రామ్ ఆయేంగే సింగర్ స్వాతి మిశ్రా ఎవరో మీకు తెలుసా..

రామ్ ఆయేంగే భజన్ ఎంతగా ఫేమస్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ప్రధాని మోదీ సైతం ఈ పాట పాడిన స్వాతి మిశ్రా మధురమైన గానానికి మంత్రముగ్ధులయ్యారు. పాటకు సంబంధించిన వీడియోను పీఎం..తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. “శ్రీ రామ్ లల్లాకు స్వాగతం పలికేందుకు స్వాతి మిశ్రా చేసిన ఈ భక్తి భజన మంత్రముగ్దులను చేస్తుంది” అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో స్వాతి మిశ్రా పేరు సంచలనంగా మారింది. ఆమె ఎవరో మీకు తెలుసా..

బిహార్‌కు చెందిన స్వాతి మిశ్రా.. ముంబయిలో నివాసం ఉంటున్నారు. ఆమె యూట్యూబ్ ఛానెల్‌ని నిర్వహించడమే కాకుండా సోషల్ మీడియాకు కంటెంట్ ఇస్తున్నారు. కాగా.. రామ్ ఆయేంగే పాట ఆమె.. యూట్యూబ్ ఛానెల్‌లో అక్టోబర్ 5, 2023న విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం 47 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

మరోవైపు.. గుజరాత్ ఫోక్ సింగర్ గీతాబెన్ రాబరి ‘శ్రీ రామ్ ఘర్ ఆయేగా’ అనే భజన పాట భక్తి పారవశ్యాన్ని మరింత పెంచుతోంది. ఆ పాట విని భావోద్వేగానికి గురైనట్లు ప్రధాని మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Updated Date - Jan 08 , 2024 | 04:02 PM