Share News

Narendra Modi: పదేళ్లలో చేసింది కేవలం ట్రయిలరే... చేయాల్సింది చాలానే ఉంది

ABN , Publish Date - Apr 05 , 2024 | 04:29 PM

భారతీయ జనతా పార్టీ సారధ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు 'ట్రయిలర్' మాత్రమేనని, చేయాల్సింది మాత్రం చాలానే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్‌ లోని చురులో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మాట్లాడారు.

Narendra Modi: పదేళ్లలో చేసింది కేవలం ట్రయిలరే... చేయాల్సింది చాలానే ఉంది

చురు: భారతీయ జనతా పార్టీ (BJP) సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్యకూటమి (NDA) పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు 'ట్రయిలర్' (TRAILER) మాత్రమేనని, చేయాల్సింది మాత్రం చాలానే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. రాజస్థాన్‌ (Rajasthan)లోని చురు (Churu)లో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మాట్లాడుతూ, గత పదేళ్లలో సాధించిన ప్రగతి కంటే చేయాల్సింది చాలా ఉందని, ఎన్నో కలలు (డ్రీమ్స్) ఉన్నాయని, దేశాన్ని తాము ముందుకు తీసుకువెళ్తామని భరోసా ఇచ్చారు.


''2019 ఫిబ్రవరి 26న నేను చురు వచ్చినప్పుడు బాలాకోట్‌లో 'ఎయిర్ స్ట్రైక్' జరిగింది. టెర్రరిస్టులకు మనం గుణపాఠం చెప్పాం. భరతమాతను ఎట్టి పరిస్థితుల్లోనూ తలదించుకోనీయమని ఆ సమయంలో నేను చెప్పడం జరిగింది. భారత్ సర్జికల్ దాడులు, వాయుదాడులు జరిపినప్పుడు కాంగ్రెస్, విపక్ష కూటమి నేతలు ఆధారాలు చూపించమని ప్రశ్నించారు. దేశాన్ని విభజించడం, సైన్యాన్ని అవమానించడమే కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీ అని మోదీ ఎద్దేవా చేశారు. అయోధ్యలో రామమందిరం అంశం విషయంలోనూ మౌనంగా ఉండాలని తమ పార్టీ యూనిట్లకు కాంగ్రెస్ అడ్వయిజరీ జారీ చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు.


ట్రిపుల్ తలాక్ ముస్లింలకు మేలు చేసింది

ట్రిపుల్ తలాక్ అంశాన్ని మోదీ ప్రస్తావిస్తూ, ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు ముస్లిం సోదరీమణులకు ఎంతో సహాయ పడిందని చెప్పారు. ఎందరో ముస్లిం తల్లులు, సోదరీమణులను ప్రాణాలను కాపడమే కాకుండా ప్రతి ముస్లిం కుటుంబానికి మోదీ రక్షణగా నిలిచారని అన్నారు.

Lok Sabha Elections: ఇది సైద్ధాంతిక పోరాటం, ఎన్నికల తర్వాతే పీఎం అభ్యర్థి ఎంపిక: రాహుల్



చెప్పిందే చేస్తాం..

కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడాన్ని పరోక్షంగా మోదీ ప్రస్తావిస్తూ, బీజేపీ ఏదైతే చెప్పిందో అది చేసి చూపిస్తుందని అన్నారు. ఇతర పార్టీల్లా కాకుండా బీజేపీ కేవలం మేనిఫెస్టో విడుదల చేయడం కాకుండా ''సంకల్ప్ పాత్ర''తో ముందుకు వస్తుందన్నారు. 2019 'సంకల్ప్ పాత్ర'లో ఏవైతే చెప్పామో వాటిలో దాదాపు అన్నింటినీ నెరవేర్చామని మోదీ చెప్పారు.


ఆసక్తికరమైన పోటీ..

చురు లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి ఆసక్తికరమైన పోటీ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఫీఖ్ మండేలియాపై గెలిచిన బీజేపీ నేత రకుల్ కాశ్వాన్ ఈసారి పార్టీ మారారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఈసారి ఆయన చురు నుంచి పోటీ చేస్తు్న్నారు. బీజేపీ తమ అభ్యర్థిగా దేవేంద్ర ఝఝారియాను పోటీలోకి దింపిది. ఏప్రిల్ 19న తొలి విడత‌లో భాగంగా చురులో పోలింగ్ జరుగనుంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 05 , 2024 | 04:49 PM