Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Bihar: నితీశ్ మాటలకు మోదీ మోములో నవ్వులే నవ్వులు

ABN , Publish Date - Mar 02 , 2024 | 08:05 PM

ప్రధాని మోదీ(PM Modi) బిహార్ పర్యటన ముగిసింది. ఆయన శనివారం ఒక్క రోజే రూ.34,800 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఔరంగాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో సీఎం నితీశ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

Bihar: నితీశ్ మాటలకు మోదీ మోములో నవ్వులే నవ్వులు

పట్నా: ప్రధాని మోదీ(PM Modi) బిహార్ పర్యటన ముగిసింది. ఆయన శనివారం ఒక్క రోజే రూ.34,800 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఔరంగాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో సీఎం నితీశ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నితీశ్(Nitish Kumar) మాట్లాడుతూ.. "నేను ఇది వరకు ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ మారేవాడిని. ఇప్పుడు ప్రధాని మోదీకి మాట ఇస్తున్నా.. ఇకపై ఎక్కడికి వెళ్లను. చివరి వరకు ఎన్డీఏ కూటమితోనే ఉంటా" అనగానే మోదీ మోములో నవ్వులు విరిశాయి. ఆయన్ని చూస్తూ.. నితీశ్ కూడా నవ్వారు. మహాఘట్‌బంధన్ కూటమిని వదిలిపెట్టాక నితీశ్‌కు చెందిన జేడీయూ పార్టీ ఎన్డీఏలో చేరిన నెల తరువాత మోదీతో కలిసి మాట్లాడారు.

Updated Date - Mar 02 , 2024 | 08:05 PM