Share News

West Bengal: ఎన్‌ఐఏ, బీజేపీ మధ్య అవగాహన: టీఎంసీ

ABN , Publish Date - Apr 11 , 2024 | 08:13 AM

బీజేపీ, ఎన్‌ఐఏ మధ్య అవగాహన ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ అభిషేక్‌ బెనర్జీ ఆరోపించారు. ఎన్‌ఐఏ అధికారులతో బీజేపీ సభ్యుడు ఒకరు సమావేశమయ్యారని ఆరోపించారు.

West Bengal: ఎన్‌ఐఏ, బీజేపీ మధ్య అవగాహన: టీఎంసీ

హుగ్లీ, ఏప్రిల్‌ 10: బీజేపీ, ఎన్‌ఐఏ మధ్య అవగాహన ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ అభిషేక్‌ బెనర్జీ ఆరోపించారు. ఎన్‌ఐఏ అధికారులతో బీజేపీ సభ్యుడు ఒకరు సమావేశమయ్యారని ఆరోపించారు. అలాగే మరో బీజేపీ కార్యకర్త ఎన్‌ఐఏ అధికారి ఇంటికి వెళ్లి ఓ ప్యాకెట్‌ ఇచ్చారని ఆరోపించారు. దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్త చేతిలో ఓ ప్యాకెట్టుతో ఎన్‌ఐఏ అధికారి ఇంట్లోకి ప్రవేశించారని, తిరిగి వచ్చేటప్పుడు అది ఆయన చేతిలో లేదని చెప్పారు. దీనికి సంబంధించిన హైక్వాలిటీ వీడియో ఫుటేజ్‌ సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. ఎన్నికల్లో గెలవలేమని భయపడుతున్న బీజేపీ... గెలిచేందుకు అనైతిక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2024 | 08:13 AM