Share News

నెహ్రూతో మోదీకి పోలికా?!: చిదంబరం

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:30 AM

నెహ్రూ మాదిరిగా తాను కూడా మూడోసారి వరుసగా ప్రధాన మంత్రి పీఠంలో కూర్చుంటున్నానన్న మోదీ వాదనను కాంగ్రెస్‌ ఖండించింది. నెహ్రూకు మోదీతో పోలిక ఏంటని ఆ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం వ్యాఖ్యానించారు.

నెహ్రూతో మోదీకి పోలికా?!: చిదంబరం

చెన్నై, జూన్‌ 7: నెహ్రూ మాదిరిగా తాను కూడా మూడోసారి వరుసగా ప్రధాన మంత్రి పీఠంలో కూర్చుంటున్నానన్న మోదీ వాదనను కాంగ్రెస్‌ ఖండించింది. నెహ్రూకు మోదీతో పోలిక ఏంటని ఆ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం వ్యాఖ్యానించారు.

‘‘బీజేపీకి 2014లో 282 సీట్లు, 2019లో 303 సీట్లు వచ్చాయి. ఈసారి ఆ పార్టీ 240 సీట్లకే పరిమితమైంది. కానీ, నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. తొలుత 361, తర్వాత 374, మూడో సారి వరుసగా 364 సీట్లు వచ్చాయి. మూడుసార్లు సొంతబలంతో ఆయన ప్రధాని అయ్యారు’’ అని చిదంబరం వివరించారు.

ఇదిలా ఉండగా, ఈవీఎంలను కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ తిరస్కరించలేదని చిదంబరం అన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను మరింత మెరుగు పరచాలని మాత్రమే కోరినట్టు తెలిపారు.

Updated Date - Jun 08 , 2024 | 07:10 AM