Share News

Farmers Protest: కేంద్రం MSP ప్రతిపాదనకు రైతు సంఘాల తిరస్కరణ..రేపటి నుంచి మళ్లీ నిరసనలు!

ABN , Publish Date - Feb 20 , 2024 | 06:47 AM

ఎంఎస్‌ఏపీ, రుణమాఫీ సహా పలు డిమాండ్ల కోసం ఢిల్లీకి పాదయాత్ర చేయాలని పట్టుదలతో ఉన్న రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన నాలుగో దఫా చర్చలు కూడా విఫలమయ్యాయి.

Farmers Protest: కేంద్రం MSP ప్రతిపాదనకు రైతు సంఘాల తిరస్కరణ..రేపటి నుంచి మళ్లీ నిరసనలు!

ఎంఎస్‌ఏపీ, రుణమాఫీ సహా పలు డిమాండ్ల కోసం ఢిల్లీ(Delhi)కి పాదయాత్ర చేయాలని పట్టుదలతో ఉన్న రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన నాలుగో దఫా చర్చలు కూడా విఫలమయ్యాయి. కేంద్రం ఇచ్చిన ప్రతిపాదనలను తిరస్కరించారు. తమ డిమాండ్లను ఆమోదించకుంటే ఫిబ్రవరి 21న ఢిల్లీకి పాదయాత్ర చేస్తామని రైతు నాయకులు ప్రకటించారు. మిగిలిన డిమాండ్లపై కూడా ప్రభుత్వం నుంచి సమాధానాలు చెప్పాలన్నారు. ప్రస్తుతం 23 పంటలకు ప్రభుత్వం ఎంఎస్‌పీ(MSP) హామీ ఇవ్వాలని, మిగిలిన పంటలకు కూడా అధ్యయనం చేసి హామీ ఇవ్వాలని అన్నారు.


చండీగఢ్‌లో రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన నాలుగో రౌండ్ చర్చల్లో మరో నాలుగు పంటలకు ఎంఎస్‌పీ(MSP) ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వరి, గోధుమలతో పాటు, కందులు, ఉరద్, మొక్కజొన్న, పత్తి పంటలపై కూడా MSP ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దీని కోసం రైతులు నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నుంచి అనుమతి పొందాలి) ఐదు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆందోళన విరమించాలని పీయూష్ గోయల్ రైతుల సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు.

కేంద్రం ప్రతిపాదనపై అన్ని సంస్థలతో మాట్లాడతామని రైతు నేతలు తెలిపారు. కేంద్రం ప్రతిపాదన బాగుందని, రెండు రోజులు పరిశీలిస్తామని ఢిల్లీ వెళ్లాలా.. ఇంటికి వెళ్లాలా అనేది 21న నిర్ణయిస్తామని రైతు నేతలు జగ్జిత్ సింగ్ దల్వాల్, సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. రుణమాఫీపై చర్చ ఇంకా కొనసాగుతోంది. ఢిల్లీ వెళ్లే కార్యక్రమం ఇంకా అలాగే ఉంది. ఫిబ్రవరి 21 వరకు సమయం ఉంది.

Updated Date - Feb 20 , 2024 | 07:06 AM