Share News

Bihar: బిహార్‌లో న్యాయ్ యాత్ర ముగింపు.. నేడు ఉత్తరప్రదేశ్‌లోకి రాహుల్ గాంధీ

ABN , Publish Date - Feb 16 , 2024 | 11:38 AM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ బిహార్‌(Bihar)లో ముగియనుంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్(Tejaswi Yadav) శుక్రవారం ససారంలో రాహుల్ గాంధీతో కలిసి న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు.

Bihar: బిహార్‌లో న్యాయ్ యాత్ర ముగింపు.. నేడు ఉత్తరప్రదేశ్‌లోకి రాహుల్ గాంధీ

ససారం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ బిహార్‌(Bihar)లో ముగియనుంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్(Tejaswi Yadav) శుక్రవారం ససారంలో రాహుల్ గాంధీతో కలిసి న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. బిహార్ అనంతరం యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి చేరుకోనుంది. ససారంలో తేజస్వీ యాదవ్ జీపు నడపగా.. పక్కన రాహుల్ కూర్చున్నారు. కైమూర్‌లో జరిగే బహిరంగ సభలో యాదవ్, రాహుల్ గాంధీతో వేదికను పంచుకుంటారు.

సీఎం నితీశ్ కుమార్ ఇండియా కూటమితో సంబంధాలు తెంచుకున్న తర్వాత తేజస్వీ, రాహుల్ గాంధీతో కలవడం ఇదే తొలిసారి. “యాత్రలో భాగంగా రాహుల్ ఇవాళ రోహతాస్‌లో రైతు నాయకులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో తేజస్వి, రాహుల్ కైమూర్‌కి చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 5 గంటలకు సభలో ప్రసంగిస్తారు. తరువాత న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది’’ అని పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్‌ అన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 16 , 2024 | 11:38 AM