Share News

Viral Video: కుక్కకు బిస్కెట్లు పెడితే బీజేపీకి నొప్పేంటి?.. రాహుల్ స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Feb 06 , 2024 | 05:17 PM

కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఒక కుక్కపిల్లకు బిస్కట్లు తినిపిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను బీజేపీ షేర్ చేస్తూ, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. దీనిపై రాహుల్ గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ''బీజేపీకి కుక్కలు ఏమి హాని చేశాయి? ఇదేనా వారికి కుక్కపిల్లలపై ఉన్న ప్రేమ'' అంటూ రాహుల్ నిలదీశారు.

Viral Video: కుక్కకు బిస్కెట్లు పెడితే బీజేపీకి నొప్పేంటి?.. రాహుల్ స్ట్రాంగ్ కౌంటర్

రాంచీ: కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో ఒక కుక్కపిల్లకు బిస్కట్లు తినిపిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను బీజేపీ షేర్ చేస్తూ, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. దీనిపై రాహుల్ గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ''బీజేపీకి కుక్కలు ఏమి హాని చేశాయి? ఇదేనా వారికి కుక్కపిల్లలపై ఉన్న ప్రేమ'' అంటూ రాహుల్ నిలదీశారు.


అసలు వివాదం ఏమిటంటే..?

జార్ఖాండ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఒక కుక్కపిల్లకు తన చేతులతో బిస్కెట్లు తినిపించారు. ఒక దశలో బిస్కెట్లు తినడానికి కుక్కపిల్ల ఇష్టపడలేదు. దాంతో రాహుల్ తన పక్కన ఉన్న వ్యక్తికి ఆ బిస్కెట్ ఇచ్చారు. దీంతో రాహుల్‌ను బీజేపీ టార్గెట్ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. రాహుల్ తన మద్దతుదారులను కుక్కల్లా చూస్తున్నారంటూ ఆక్షేపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో రాహుల్‌ను మీడియో ప్రశ్నించింది. కార్యకర్తకు కుక్క బిస్లెట్లు ఇచ్చారా అంటూ రాహుల్‌ను మీడియా ప్రశ్నించడంతో ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. ''లేదు, ఆయన కాంగ్రెస్ కార్యకర్త కాదు. కుక్కల పట్ల బీజేపీకి ఉన్న ప్రేమ ఏపాటిదో నాకు అర్ధం కావడం లేదు. కుక్కలు వాళ్లకు ఏమి హాని చేశాయి'' అని ప్రశ్నించారు. దీనిపై రాహుల్ మరింత వివరణ ఇస్తూ, యాత్రలో తాను పప్పీ (కుక్కపిల్ల)ని, దాని యజమానిని పిలిచాననీ, పప్పీకి బిస్కెట్లు తినిపిద్దామనుకుంటే అది కొంత నెర్వస్‌గా, భయంగా కనిపించిందని చెప్పారు. దాంతో పప్పీ యజమానికే ఆ బిస్కెట్లు ఇచ్చానని, అతను తినిపించగానే పప్పీ ఆప్యాయంగా వాటిని తిందని చెప్పారు. ఇందులో సమస్య ఏముంది? అని రాహుల్ ఎదురు నిలదీశారు.

Updated Date - Feb 06 , 2024 | 05:19 PM