Share News

UCC: ఉత్తరాఖండ్‌ ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:01 PM

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. మతంతో సంబంధం లేకుండా వివాహాలు, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వ చట్టాలు అందరికీ ఒకేరీతిలో వర్తించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, బిల్లు సభామోదం పొందింది.

UCC: ఉత్తరాఖండ్‌ ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ (Uttarakhand) అసెంబ్లీలో ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి (UCC) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) బుధవారంనాడు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. మతంతో సంబంధం లేకుండా వివాహాలు, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వ చట్టాలు అందరికీ ఒకేరీతిలో వర్తించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, బిల్లు సభామోదం పొందింది.


చట్టంలో ముఖ్యాంశాలు

వివాహాలు, విడాకులు, వారసత్వం, లివ్-ఇన్ రిలేషన్ షిప్ , సంబంధిత అంశాలకు ఉద్దేశించి ఈ చట్టం రూపొందింది. యూసీసీ ప్రకారం సహజీవనం సాగించడాన్ని (live-in relationship) కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. బాల్య వివాహాలపై సంపూర్ణ నిషేధం ఉంటుంది. విడాకులకు సబంధించి యూనిఫాం విధానం అమల్లోకి వస్తుంది. అన్ని మతాల్లోని మహిళలకు ఆస్తిలో సమాన హక్కులను ఈ చట్టం కల్పిస్తుంది. యూసీసీ చట్టం ప్రకారం యువతుల వివాహ వయోపరిమితి 18 ఏళ్లుగా, యువకుల వివాహ వయోపరిమితి 21 ఏళ్లుగా నిర్ధారించారు. వివాహాల రిజిస్ట్రేషన్ అన్ని మతాల వారికి తప్పనిసరి. రిజిస్ట్రేషన్ జరక్కుంటే ఆ వివాహం చెల్లదు. ఏడాది తర్వాత మాత్రమే విడాకుల పిటిషన్లను అనుమతిస్తారు. మాజీ చీఫ్ సెక్రటరీ సారథ్యంలోని తొమ్మిది మంది సభ్యుల కమిటీ యూజీసీ ముసాయిదాను రూపొందించింది.

Updated Date - Mar 13 , 2024 | 03:01 PM