Share News

Bihar: తేజస్వీ యాదవ్ ఎస్కార్ట్ వాహనం బీభత్సం.. ఒకరు మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:36 PM

ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) ఎస్కార్ట్‌లోని ఓ వాహనం బీభత్సం సృష్టించింది. పూర్నియా జిల్లాలో తేజస్వి యాదవ్‌కు ఎస్కార్ట్‌గా వెళ్తున్న పోలీసు వాహనం ఎదురుగా ఉన్న మరో కారును ఢీకొనడంతో 50 ఏళ్ల హోంగార్డు మహమ్మద్ హలీం మృతి చెందినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Bihar: తేజస్వీ యాదవ్ ఎస్కార్ట్ వాహనం బీభత్సం.. ఒకరు మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు

పూర్ణ: ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) ఎస్కార్ట్‌లోని ఓ వాహనం బీభత్సం సృష్టించింది. పూర్నియా జిల్లాలో తేజస్వి యాదవ్‌కు ఎస్కార్ట్‌గా వెళ్తున్న పోలీసు వాహనం ఎదురుగా ఉన్న మరో కారును ఢీకొనడంతో 50 ఏళ్ల హోంగార్డు మహమ్మద్ హలీం మృతి చెందినట్లు సీనియర్ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. పూర్నియా ఎస్పీ ఉపేంద్ర నాథ్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో అదే జీపులో ఉన్న ఆరుగురు మిలటరీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

"జన్ విశ్వాస్ యాత్ర"లో భాగంగా తేజస్వీ పర్యటన జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన BMP జవాన్లను పూర్నియాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో మిగిలిన వారికి ప్రాణాపాయం తప్పిందన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 27 , 2024 | 01:37 PM