Share News

PM Narendra Modi: స్టార్టప్‌లలో మహిళల గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 20 , 2024 | 12:46 PM

ప్రస్తుతం దేశంలో 1.25 లక్షలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయని దీని ద్వారా 12 లక్షల మంది యువత ఉపాధిని పొందుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) అన్నారు. ఢిల్లీ(delhi)లోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన స్టార్టప్ మహాకుంభ్‌(startup Mahakumbh Event 2024) కార్యక్రమానికి హాజరైన క్రమంలో పేర్కొన్నారు.

PM Narendra Modi: స్టార్టప్‌లలో మహిళల గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం దేశంలో 1.25 లక్షలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయని దీని ద్వారా 12 లక్షల మంది యువత ఉపాధిని పొందుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) అన్నారు. ఢిల్లీ(delhi)లోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన స్టార్టప్ మహాకుంభ్‌(startup Mahakumbh Event 2024) కార్యక్రమానికి హాజరైన క్రమంలో పేర్కొన్నారు. దేశంలోని స్టార్టప్‌లలో 45% పైగా భారతీయ మహిళలు అగ్రగామిగా ఉండి విజయం సాధించారని ప్రధాని వెల్లడించారు. ఈ క్రమంలో వ్యవసాయం, జౌళి, వైద్యం, రవాణా, అంతరిక్షం, యోగా, ఆయుర్వేదం వంటి రంగాల్లో స్టార్టప్‌లు మొదలైనందుకు సంతోషిస్తున్నట్లు మోదీ తెలిపారు.

మరోవైపు రాజకీయాల్లో కూడా కొంతమంది స్టార్టప్‌లు(startups) ప్రారంభిస్తున్నారని ప్రధాని గుర్తు చేశారు. అలాంటి వారు ప్రయోగం విజయవంతం కాకపోతే, వెంటనే మరొకదానికి వెళ్లాలని సూచించారు. భారతీయ స్టార్టప్‌లు 50కి పైగా అంతరిక్ష రంగాలలో పని చేస్తున్నాయని చెప్పారు. గత దశాబ్దంలో ఐటి, సాఫ్ట్‌వేర్ రంగంలో భారతదేశం గొప్ప పురోగతిని సాధించిందని మోదీ అన్నారు. ఇప్పుడు భారతదేశం ఆవిష్కరణ, స్టార్టప్ సంస్కృతిని కూడా అభివృద్ధి చేయడంలో వేగంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు.


స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమం మార్చి 18-20 వరకు న్యూఢిల్లీ(delhi)లోని భారత్ మండపం(Bharat Mandapam)లో జరుగుతోంది. ఈ ఈవెంట్‌ను అపెక్స్ ఇండస్ట్రీ అసోసియేషన్, బూట్‌స్ట్రాప్ ఇంక్యుబేషన్ అండ్ అడ్వైజరీ ఫౌండేషన్, ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేటివ్ క్యాపిటల్ అసోసియేషన్ (IVCA) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం థీమ్ భారత్ ఇన్నోవేట్స్. స్టార్టప్ మహాకుంభ్ అనేది దేశంలో అతిపెద్ద మొదటి స్టార్టప్ కార్యక్రమం.

ఇక్కడ డీప్‌టెక్, అగ్రిటెక్, బయోటెక్, మెడ్‌టెక్ సహా పలు రంగాల అభివృద్ధికి నిపుణులతోపాటు కొత్త టెక్నాలజీలకు(technology) ఇక్కడ అవకాశం ఉంటుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో 2000 స్టార్టప్‌లు, 1000+ పెట్టుబడిదారులు, 100+ యునికార్న్‌లు, 300+ ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్‌లు ఉన్నాయి. దీనికి దేశవ్యాప్తంగా 3,000 మంది ప్రతినిధులు, 10 కంటే ఎక్కువ దేశాల ప్రతినిధులు, 3000 మందికి పైగా కాబోయే వ్యవస్థాపకులు సహా పలువురు హాజరయ్యారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: FLY91: రూ.1991కే హైదరాబాద్ టూ గోవా విమాన ప్రయాణం!

Updated Date - Mar 20 , 2024 | 01:29 PM