Share News

Parliament session: బడ్జెట్ సమావేశాలు ఒకరోజు పొడిగింపు

ABN , Publish Date - Feb 07 , 2024 | 02:19 PM

ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 10వ తేదీ వరకూ పొడిగించారు. బడ్జెట్ సమావేశాలను ఒకరోజు పొడిగిస్తున్నట్టు లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లా ప్రకటించగా, రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ మంగళవారంనాడు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీతో ముగియాల్సి ఉన్నాయి.

Parliament session: బడ్జెట్ సమావేశాలు ఒకరోజు పొడిగింపు

న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను (Parliament Budget session) ఫిబ్రవరి 10వ తేదీ వరకూ పొడిగించారు. బడ్జెట్ సమావేశాలను ఒకరోజు పొడిగిస్తున్నట్టు లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లా ప్రకటించగా, రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ మంగళవారంనాడు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీతో ముగియాల్సి ఉన్నాయి. 17వ లోక్‌సభ చివరి సమావేశాలు కూడా ఇవే కావడం విశేషం. యూపీఏ పదేళ్ల పాలనలో అస్తవ్యస్థమైన దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందన్న పుకార్ల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల పొడిగింపు ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated Date - Feb 07 , 2024 | 02:19 PM