Share News

Narendra Modi: మళ్లీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మోదీ..ఈ గ్రామాలను పట్టించుకోలేదని వ్యాఖ్య

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:19 PM

నేడు ఈశాన్య రాష్ట్రాల్లో రూ.55,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని 35 వేల పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్లు లభించాయని చెప్పారు. ఈ క్రమంలోనే మోదీ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Narendra Modi: మళ్లీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మోదీ..ఈ గ్రామాలను పట్టించుకోలేదని వ్యాఖ్య

నేడు ఈశాన్య రాష్ట్రాల్లో రూ.55,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని 35 వేల పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్లు లభించాయని చెప్పారు. దీంతోపాటు అరుణాచల్(arunachal pradesh), త్రిపుర(tripura)లో వేలాది కుటుంబాలు నీటి కనెక్షన్లు పొందాయని అన్నారు. దీంతోపాటు ఈశాన్య రాష్ట్రాలలో కనెక్టివిటీకి సంబంధించిన అనేక ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయని వెల్లడించారు.

ప్రారంభించిన వాటిలో సెలా టన్నెల్(sela tunnel) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (13000 అడుగులు) ప్రాంతంలో నిర్మించిన పొడవైన సొరంగం ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమింగ్, తవాంగ్ జిల్లాలను కలుపుతుంది. LACకి చేరుకోవడానికి ఇదే ఏకైక మార్గం కావడం విశేషం. అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ(pema khandu) ప్రధాని మోదీకి బహుమతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.


ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌(itanagar)లో జరిగిన 'విక్షిత్ భారత్ విక్షిత్ ఈశాన్య' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్(congress) పార్టీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌తో ఇండియా కూటమి పొత్తు గురించి మోదీ ప్రస్తావించారు. ఇండియా కూటమిలోని సభ్యులు వంశపారంపర్య నాయకులని ప్రధాని అన్నారు. అంతేకాదు వారు మోదీ పరివార్ గురించి అడుగుతున్నారని తెలిపారు. అరుణాచల్ పర్వతాలలో నివసించే ప్రతి ఫ్యామిలీ మోదీ కుటుంబమని ప్రధాని అన్నారు. సరిహద్దు గ్రామాలను కాంగ్రెస్‌ విస్మరించిందని అన్నారు. కానీ మాకు ఇవే మొదటి గ్రామాలని మోదీ చెప్పారు.


గత ఐదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎంతగానో పనిచేశామని మోదీ(modi) అన్నారు. కానీ ఈ పని చేయడానికి కాంగ్రెస్‌కు 20 ఏళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. అయితే గత 10 ఏళ్లలో 6 వేల కి.మీ కంటే ఎక్కువ జాతీయ రహదారులు నిర్మించినట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 10 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని మాత్రమే నిర్మించిందని ప్రధాని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘మిషన్ పామ్ ఆయిల్’ను ప్రారంభించిందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ మిషన్ కింద మొదటి ఆయిల్ మిల్లు ప్రారంభించబడిందని.. దీని ద్వారా ఇక్కడి రైతుల(farmers) ఆదాయం పెరుగుతుందని వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Business Idea: రూ.5 వేల పెట్టుబడి.. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం

Updated Date - Mar 09 , 2024 | 12:19 PM