Lok Sabha elections: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు..ఎందుకంటే..?
ABN , Publish Date - Apr 26 , 2024 | 07:39 PM
బీజేపీ ఎంపీ, ఆ పార్టీ బెంగళూరు సౌత్ ఢిల్లీ అభ్యర్థి తేజస్వి సూర్యపై కేసు నమోదైంది. మతం పేరుతో ఓట్లు అడుగుతూ ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించారనే కారణంగా ఆయనపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. శుక్రవారం జరిగిన లోక్సభ రెండో విడత పోలింగ్లో బెంగళూరు సౌత్ ఢిల్లీలో పోలింగ్ జరిగింది.
బెంగళూరు: బీజేపీ ఎంపీ, ఆ పార్టీ బెంగళూరు సౌత్ ఢిల్లీ అభ్యర్థి తేజస్వి సూర్య (Tejaswi Surya)పై కేసు నమోదైంది. మతం పేరుతో ఓట్లు అడుగుతూ ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించారనే కారణంగా ఆయనపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. శుక్రవారం జరిగిన లోక్సభ రెండో విడత పోలింగ్లో బెంగళూరు సౌత్ ఢిల్లీలో పోలింగ్ జరిగింది.
Akhilesh Assets: అఖిలేష్కు రూ.54 లక్షలు బాకీపడిన డింపుల్ యాదవ్
తేజస్వి సూర్యపై కేసు నమోదు చేసిన విషయాన్ని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ అధికారి 'ఎక్స్' మాధ్యమంలో వెల్లడించారు. ''మతం పేరుతో ఓట్లు అడుగుతూ తేజస్వి సూర్య ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడం కిందకు వస్తుంది. దీనిపై సెక్షన్ 123(2) కింద ఈనెల 25వ తేదీన జయనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది'' అని ఆయన చెప్పారు.
Read Latest National News and Telugu News