Share News

Akhilesh Assets: అఖిలేష్‌కు రూ.54 లక్షలు బాకీపడిన డింపుల్ యాదవ్

ABN , Publish Date - Apr 26 , 2024 | 07:08 PM

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ లోక్‌సభకు పోటీ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఆ ప్రకారం అఖిలేష్ రూ.26.34 కోట్లు విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్నారు. ఆయన భార్య, మెయిన్‌పురి నియోజకవర్గం పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్‌కు రూ.15 కోట్లు ఆస్తులు ఉన్నాయి. మొత్తంగా ఈ దంపతుల ఆస్తి విలువ రూ.41 కోట్లుగా ఉంది.

Akhilesh Assets: అఖిలేష్‌కు రూ.54 లక్షలు బాకీపడిన డింపుల్ యాదవ్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ లోక్‌సభకు పోటీ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల (Assets) వివరాలను ప్రకటించారు. ఆ ప్రకారం అఖిలేష్ రూ.26.34 కోట్లు విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్నారు. ఆయన భార్య, మెయిన్‌పురి నియోజకవర్గం పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్‌ (Dimple Yadav)కు రూ.15 కోట్లు ఆస్తులు ఉన్నాయి. మొత్తంగా ఈ దంపతుల ఆస్తి విలువ రూ.41 కోట్లుగా ఉంది. ఆసక్తికరంగా డింపుల్ యాదవ్ తన భర్య నుంచి రూ.54.26 లక్షలు అప్పుగా తీసుకున్నారు.

Lok Sabha Elections 2024: రెండో విడతలో సాయంత్రం 5 గంటల వరకూ 61 శాతం పోలింగ్


అఖిలేష్ యాదవ్ తనకు రూ.9.12 కోట్ల స్థిరాస్తులు, రూ.17.22 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో ప్రకటించారు. ఆయన భార్య డింపుల్‌కు రూ.5.1 కోట్ల స్థిరాస్తి ఉండగా, రూ.10.44 కోట్ల చరాస్తి ఉంది. నగదు రూపంలో తనవద్ద రూ.25.61 లక్షలు, బ్యాంకుల్లో రూ.5.41 కోట్ల ఉన్నట్టు అఖిలేష్ ప్రకటించారు. గత ఐదేళ్లుగా తన సగటు వార్షిక ఆదాయం రూ.65 లక్షలుగా తెలిపారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 07:08 PM