Share News

Lok Sabha Elections: బీహార్‌లో పొత్తులు ఖరారు.. కాంగ్రెస్‌కు 9 సీట్లు కేటాయించిన ఆర్జేడీ

ABN , Publish Date - Mar 29 , 2024 | 03:05 PM

'ఇండియా' కూటమి భాగస్వామ్య పక్షాలుగా ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య బీహార్‌ లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు ఖరారైంది. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్‌కు 9 సీట్లను ఇవ్వాలని ఆర్జేడీ నిర్ణయించింది. పూర్ణియా నియోజవర్గంతో సహా 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుంది.

Lok  Sabha Elections: బీహార్‌లో పొత్తులు ఖరారు.. కాంగ్రెస్‌కు 9 సీట్లు కేటాయించిన ఆర్జేడీ

పాట్నా: 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి భాగస్వామ్య పక్షాలుగా ఉన్న కాంగ్రెస్ (Congress), ఆర్జేడీ (RJD) మధ్య బీహార్‌ లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు ఖరారైంది. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్‌కు 9 సీట్లను ఇవ్వాలని ఆర్జేడీ నిర్ణయించింది. పూర్ణియా నియోజవర్గంతో సహా 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుంది.


ఆర్జేడీ పోటీ చేయనున్న నియోజకవర్గాల్లో పాటలీపుత్ర, హజీపూర్, సివన్, శివహర్, పూర్వి చంపరాన్, పూర్ణియా, సుపౌల్, గయ, నవడ, జహనాబాద్, ఔరంగాబాద్, బక్సర్, జముయి, బంకా, వాల్మీకి నగర్, ముంగెర్, సీతామర్హి, వైశాలి, శరణ్, దర్బంగా, గోపాల్‌గంజ్, మధుబని, ఉజియార్‌పూర్, అరారియా, మాథేపుర, ఝంజహార్‌పూర్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కిషన్ గంజ్, కతిహార్, భాగల్‌పూర్, ముజఫర్‌పూర్, సమష్టిపూర్, వెస్ట్ చంపరాన్, పాట్నా సాహిబ్, ససరామ్, మహారాజ్‌గంజ్ నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. పొత్తుల్లో భాగగా నలందా, కరకట్, అర్రా లోక్‌సభ సీట్లను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ (సీపీఐ-ఎంఎల్)కు కేటాయించాలని ఆర్జేడీ నిర్ణయించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 03:05 PM