Share News

Crime: కుటుంబాన్ని చంపేందుకు స్కెచ్..!! రూ.65 లక్షలకు డీల్ సెట్..!!

ABN , Publish Date - Apr 23 , 2024 | 08:52 PM

కర్ణాటకలో గల గడగ్ ప్రాంతానికి చెందిన ప్రకాష్‌ మొదటి భార్య కుమారుడు వినాయక్. వినాయక్ తల్లి కాలం చేసిన తర్వాత ప్రకాష్ మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయినప్పటికీ కొనుగోలు చేసిన స్థలాలు, ప్లాట్లు వినాయక్ పేరు మీద రాశాడు. అంతవరకు బానే ఉంది. గత ఐదారునెలల నుంచి పరిస్థితి మారింది.

Crime: కుటుంబాన్ని చంపేందుకు స్కెచ్..!! రూ.65 లక్షలకు డీల్ సెట్..!!
Karnataka Man

బెంగళూర్: మంచి లేదు, మర్యాద లేదు. ప్రేమ, ఆప్యాయత ఎక్కడ కనిపించడం లేదు. అంతా డబ్బుకు విలువ ఇస్తున్నారు. పైసా కోసం చంపేందుకు వెనకాడటం లేదు. డబ్బుల విషయం వచ్చేసరికి తల్లి, తండ్రి అని కూడా చూడటం లేదు. కర్ణాటకలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.


ఏం జరిగిందంటే..?

కర్ణాటకలో గల గడగ్ ప్రాంతానికి చెందిన ప్రకాష్‌ మొదటి భార్య కుమారుడు వినాయక్. వినాయక్ తల్లి కాలం చేసిన తర్వాత ప్రకాష్ మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయినప్పటికీ కొనుగోలు చేసిన స్థలాలు, ప్లాట్లు వినాయక్ పేరు మీద రాశాడు. అంతవరకు బానే ఉంది. గత ఐదారునెలల నుంచి పరిస్థితి మారింది.


తేడా ఎందుకంటే..?

వినాయక్ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. తన పేరు మీద ఉన్న ప్లాట్లను తండ్రికి తెలియకుండా అమ్మడం ప్రారంభించాడు. దీంతో వివాదం మొదలైంది. ప్రకాష్- వినాయక్ మధ్య తరచూ ఇదే విషయంపై గొడవ జరిగేది. దాంతోపాటు ఆస్తిలో తనతోపాటు సవతి తల్లి కుమారుడికి సమాన వాటా ఇవ్వాల్సి వస్తుందని భావించాడు. వారిని చంపాలనే కఠిన నిర్ణయం తీసుకున్నాడు.


ఇలా దొరికారు

తండ్రిని చంపేందుకు కిరాయి గుండాలతో వినాయక్ డీల్ సెట్ చేశాడు. ముగ్గురిని చంపేందుకు రూ.65 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ఆ రోజు ప్రకాష్ ఇంటికి అతిథులు వచ్చారు. పెళ్లి చూసుకొని, రాత్రి ఇంట్లో ఉన్నారు. ఆ రోజు రాత్రి కిరాయి గుండాలు వచ్చి నలుగురిని హతమార్చారు. ఆ నలుగురు అతిథులు కావడంతో వినాయక్ కుట్ర బయట పడింది. ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది. వినాయక్ సహా కిరాయి గుండాలను పోలీసులు అరెస్ట్ చేశారు.


Read Latest
National News or Telugu News

Updated Date - Apr 23 , 2024 | 08:52 PM