Share News

Rajasthan: 20 సెకన్లలో 10 కత్తిపోట్లు.. అమ్మాయిపై వ్యక్తి ఘాతుకం..!

ABN , Publish Date - Mar 22 , 2024 | 09:48 AM

Rajasthan News: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో(Bharatpur) ఒళ్లు గగుర్పొడిచే దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఓ అమ్మాయి గొంతులో 10 కత్తిపోట్లు దించాడు. కేవలం 20 సెకన్లలోనే 10 సార్లు గొంతులో పొడిచాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. నిందితుడికి 13 ఏళ్ల క్రితమే పెళ్లై ఆరుగురు పిల్లలు ఉన్నారు. భయానక ఘటన వెనుక పెద్ద స్టోరీ ఉందని పోలీసులు(Rajasthan Police) చెబుతున్నారు. భరత్‌పూర్‌లోని కలెక్టర్ కార్యాలయం సమీపంలోని

Rajasthan: 20 సెకన్లలో 10 కత్తిపోట్లు.. అమ్మాయిపై వ్యక్తి ఘాతుకం..!
Rajasthan

Rajasthan News: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో(Bharatpur) ఒళ్లు గగుర్పొడిచే దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఓ అమ్మాయి గొంతులో 10 కత్తిపోట్లు దించాడు. కేవలం 20 సెకన్లలోనే 10 సార్లు గొంతులో పొడిచాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. నిందితుడికి 13 ఏళ్ల క్రితమే పెళ్లై ఆరుగురు పిల్లలు ఉన్నారు. భయానక ఘటన వెనుక పెద్ద స్టోరీ ఉందని పోలీసులు(Rajasthan Police) చెబుతున్నారు. భరత్‌పూర్‌లోని కలెక్టర్ కార్యాలయం సమీపంలోని పట్పరా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిందితుడు డీగ్ జిల్లాలోని నౌనేరా గ్రామానికి చెందిన సోను శర్మ (31)గా గుర్తించారు పోలీసులు. అతను ఫార్మాస్యూటికల్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. మృతురాలిని పూనమ్ శర్మ (21)గా గుర్తించారు. ఈమె భరత్‌పూర్ నగరంలోని సహయోగ్ నగర్‌లో నివాసం ఉంటోంది. సోను శర్మకు 13 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. అతనికి ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. భార్యకు తెలియకుండా మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మహిళను భరత్‌పూర్‌లో గల ఒక రూమ్‌కు తీసుకువచ్చాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వీరిద్దరికీ గొడవ జరిగింది. మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తుడైన సోను శర్మ.. కత్తి తీసుకుని మహిళపై దాడి చేశాడు. కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే 10 సార్లు గొంతులో పొడిచాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ మహిళ ప్రాణాలు విడిచింది. మహిళను చంపిన సోను శర్మ.. అక్కడే ఉండి పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తలను నరికేశాడు..

హత్యకు గల కారణాలపై పోలీసులు నిందితుడిని విచారించగా.. సంచలన విషయాలు బహిర్గతం చేశాడు. రెండేళ్ల క్రితం ఓ వివాహ వేడుకలో పూనమ్ శర్మను కలిశానని నిందితుడు చెప్పాడు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పూనమ్‌కు దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేశానని నిందితుడు చెప్పాడు. ఇటీవల పూనమ్‌ సోదరుడి పెళ్లి కోసం రూ. 50 వేలు ఇచ్చానని తెలిపాడు. అయితే, పూనమ్ హర్యానాకు చెందిన మరో వ్యక్తితో మాట్లాడుతోందని ఆరోపించాడు. అతనితోనూ సంబంధం కొనసాగిస్తోందన్నాడు. ఇదే విషయంలో వారి మధ్య గొడవ జరిగిందట. అతనితో మాట్లాడొద్దని కోరగా.. పూనమ్ ఒప్పుకోలేదన్నాడు. ఈ క్రమంలోనే గదికి తీసుకువచ్చి ఆమెను ఒప్పించాలని ప్రయత్నించాడు సోనూ శర్మ. కానీ, మహిళ అతని మాటలను పట్టించుకోలేదు. దాంతో కోపంతో ఊగిపోయిన సోనూ.. కత్తితో ఆమెపై దాడి చేశాడు. 10 సార్లు ఆమె గొంతును కోసేశాడు. దాంతో ఆమె తల దాదాపు వేరుపడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2024 | 09:48 AM