Share News

Couples: 24 గంటల్లో నవ దంపతుల మృతి.. గుండెపోటుతో భర్త, తట్టుకోలేక భార్య

ABN , Publish Date - Feb 27 , 2024 | 03:15 PM

24 గంటల్లో నవ దంపతులు మృతిచెందారు. ఢిల్లీ జూ చూడడానికి వచ్చిన సమయంలో గుండెపోటు వచ్చి భర్త చనిపోయాడు. తట్టుకోలేక భార్య ప్రాణాలను తీసుకుంది.

Couples: 24 గంటల్లో నవ దంపతుల మృతి.. గుండెపోటుతో భర్త, తట్టుకోలేక భార్య

ఢిల్లీ: భర్త మృతిని తట్టుకోలేక పోయింది నవ వధువు. అప్పటి వరకు తనతో ఉన్న వ్యక్తి విగతజీవిగా మారడాన్ని తట్టుకోలేక పోయింది. కడవరకు తోడుంటాని ఇచ్చిన మాట గుర్తొచ్చిందో ఏమో ఆత్మహత్య చేసుకుంది. 24 గంటల్లో నవ దంపతులు (Couple) మృతిచెందారు. ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపారు.

ఏం జరిగిందంటే..?

ఘజియాబాద్‌లో అభిషేక్ (Abhishek)- అంజలి (Anjali) దంపతులు నివసిస్తున్నారు. గత ఏడాది నవంబర్ 30వ తేదీన వీరికి వివాహామైంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారని స్నేహితులు చెబుతున్నారు. ఢిల్లీలో ఉన్న జూ చూసేందుకు సోమవారం (నిన్న) దంపతులు వెళ్లారు. అక్కడ అంతా కలియ తిరిగారు. అభిషేక్ అస్వస్థతకు గురయ్యాడు. ఛాతీలో నొప్పి వచ్చిందని చెప్పడంతో అంజలి భయ పడింది. స్నేహితులకు కాల్ చేయగా వారు వచ్చి ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో అభిషేక్ మృతిచెందాడు.

అంజలి మృతి

అభిషేక్ చనిపోయిన తర్వాత పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశారు. సోమవారం రాత్రి 9 గంటలకు అపార్ట్ మెంట్ వద్దకు అభిషేక్ మృతదేహం తీసుకొచ్చారు. అభిషేక్‌ను అలా చూసి అంజలి తట్టుకోలేక పోయింది. డెడ్ బాడీ పక్కనే కూర్చొని చాలా సేపు ఏడ్చింది. తర్వాత పైకి వెళ్లింది. ఏడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లింది. కొంచెం దూరంలో ఉన్న బంధువులు ఆమెను ఎక్కడి అని అడిగారు. పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. అనుమానం వచ్చి వెనకాల రాగా ఇంతలో అంజలి దూకేసింది. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఏడో అంతస్తు నుంచి పడిపోవడం, గాయాలు ఎక్కువ అవడంతో అంజలి కన్నుమూసింది. 24 గంటల్లోనే తన భర్త వద్దకు అంజలి చేరింది.

అభిషేక్- అంజలి దంపతుల మృతితో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. నిన్న, మొన్నటి వరకు తమతో కలిసి ఉన్న వారు ఇలా కావడం చుట్టు పక్కల వారు జీర్ణించుకోలేక పోతున్నారు. అభిషేక్- అంజలి కుటుంబాలు బాధ వర్ణణాతీతం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 03:15 PM