Share News

Jharkhand: పది రోజుల కస్టడీ కోరిన ఈడీ.. తీర్పు రిజర్వ్

ABN , Publish Date - Feb 01 , 2024 | 06:01 PM

జార్ఖాండ్‌ను కుదిపేస్తున్న భూ ఆక్రమణల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఈడీ అరెస్టు చేసిన జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ కు రాంచీలోని పీఎంఎల్ఏ కోర్టు ఒకరోజు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Jharkhand: పది రోజుల కస్టడీ కోరిన ఈడీ.. తీర్పు రిజర్వ్

రాంచీ: జార్ఖాండ్‌ను కుదిపేస్తున్న భూ ఆక్రమణల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఈడీ అరెస్టు చేసిన జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ (Hemant Soren)కు రాంచీలోని పీఎంఎల్ఏ కోర్టు ఒకరోజు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. పది రోజుల పాటు ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరినప్పటికీ, ఒక రోజు జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశాలిచ్చింది. మనీలాండరింగ్ కేసులో బుధవారంనాడు 6 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం హేమంత్ సోరెన్ తన రాజీనామాను గవర్నర్‌కు బుధవారం రాత్రి సమర్పించారు. ఆ కొద్దిసేపటికే ఈడీ ఆయనను అరెస్టు చేసింది. పీఎంఎల్ఏ కోర్టు ముందు గురువారం ఉదయం హాజరుపరిచింది.


మరోవైపు, మనీలాండరింగ్‌ కేసు కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం శుక్రవారంనాడు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.

Updated Date - Feb 01 , 2024 | 06:28 PM