Home » Hemant Soren
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Soren) మనీ లాండరింగ్ కేసులో ఆదివారం ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈడీ దర్యాప్తులో టీవీ, రిఫ్రిజిరేటర్లు సాక్ష్యాలుగా నిలవనున్నట్లు తెలుస్తోంది.
లిక్కర్ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్లో ఓ భూ కుంభకోణం వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల వ్యవధిలో ఇద్దరు ముఖ్యమంత్రులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ శనివారంనాడు న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ను కలుసుకున్నారు. సోనియాగాంధీని సైతం కలుస్తున్నట్టు కల్పనా సోరెన్ తెలిపారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జ్యుడీషియల్ కస్టడీని పెంచుతూ రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాంచీ: మనీ లాండరింగ్ కేసులో జైలుపాలైన జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren)ను తలుచుకుని ఆయన భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren) కంటతడి పెట్టారు. రాంచీలో జరిగిన జేఎంఎం (JMM) కార్యక్రమంలో ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.
భూకుంభకోణం కేసులో మనీలాండరింగ్ కింద అరెస్టయిన జేఎంఎం నేత, జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించారు. రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు సోమవారంనాడు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
భూకుంభ కోణం(Land Scam) కేసులో జుడీషియల్ రిమాండ్లో ఉన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean)కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈడీ(ED) అధికారులు ఆయన ధ్వంసం చేసిన మొబైళ్లలో వాట్సప్ చాట్ రికవర్ చేశారు.
పటిష్ఠ బందోబస్తు మధ్య జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈరోజు అసెంబ్లీకి చేరుకున్నారు. తన అరెస్టులో రాజ్ భవన్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు.
మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న హేమంత్ సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో జార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. ఆయన రాజీనామా అనంతరం చంపై సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
జార్ఖాండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఈడీ అరెస్టుతో బిర్సా ముండా జైలులో ఉన్న హేమంత్ సోరెన్కు ఊరట లభించింది. జేఎంఎం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపయి సోరెన్ ఈనెల 5న అసెంబ్లీలో బలనిరూపణ చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగే ఓటింగ్కు హాజరయ్యేందుకు హేమంత్ సోరెన్ను రాంచీ ప్రత్యేక కోర్టు అనుమతించింది.