Home » Hemanth Soren
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సీనియర్ నేత చంపై సోరెన్ తన X ప్రొఫైల్ నుంచి జేఎంఎం పేరును తొలగించారు. దీంతో చంపై సోరెన్ బీజేపీలోకి వెళ్లబోతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
భూముల కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి జార్ఖండ్ సీఎం సొరేన్కు ఆ రాష్ట్ర హైకోర్టు జూన్ 28న ఇచ్చిన బెయిల్ హేతుబద్ధమైందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్కు ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ ఈడీ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. ఈ సందర్బంగా హేమంత్ సోరెన్కు జార్ఖ్ండ్ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులోని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం సమర్థించింది.
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సోమవారం ప్రఽధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలను హేమంత్ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోతుందని ఝార్ఖండ్ ముక్తి మోర్చ నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ జోస్యం చెప్పారు. శనివారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో తన పార్టీ మద్దతుదారులతో ఆయన సమావేశమయ్యారు.
ల్యాండ్ స్కాం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Soren)కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఉపశమనం కలిగింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.
తాను ముఖ్యమంత్రి కావడమనేది ఊహాత్మకమని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య, జార్ఖండ్ ముక్తి మోర్చ నాయకురాలు కల్పన సోరెన్ స్పష్టం చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి (INDIA Bloc)వినూత్నంగా నిరసన తెలిపింది. ఆదివారం కూటమి ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా జార్ఖండ్లో మెగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో 28 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. అక్రమంగా తమ నేతలను అరెస్టు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్కు నిరసనగా ఆదివారం రాంచీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహిస్తుంది. ఈ ర్యాలీలో కూటమిలోని 14 మంది నాయకులు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత తదితరులు ఈ మెగా ర్యాలీకి హాజరవుతున్నారు.
జార్ఖండ్ అసెంబ్లీలో ఈ రోజు బలపరీక్ష జరగనుంది. మనీ ల్యాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో జేఎంఎం సీనియర్ నేత చంపయి సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు.