Share News

Sonia Gandhi: రేపు రాజ్యసభకు నామినేషన్ వేయనున్న సోనియాగాంధీ

ABN , Publish Date - Feb 13 , 2024 | 07:18 PM

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రేపు (బుధవారం) రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు కోసం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే రేపు జైపూర్ వెళ్లనున్నారు.

Sonia Gandhi: రేపు రాజ్యసభకు నామినేషన్ వేయనున్న సోనియాగాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రేపు (బుధవారం) రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు కోసం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే రేపు జైపూర్ వెళ్లనున్నారు. కాగా సోనియా గాంధీ ప్రస్తుతం రాయ్ బరేలి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలి సీటు నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారు. ప్రియాంక గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రేపు సోనియా నామేనేషన్ పాల్గొననుండడంతో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు విరామం ఇవ్వనున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 07:18 PM