Share News

Chennai: ఎట్టకేలకు పట్టుబడిన మూడో చిరుత..

ABN , Publish Date - May 23 , 2024 | 11:36 AM

తిరునల్వేలి జిల్లా పాపనాశం అటవీ రేంజ్‌ పరిధిలో వరుసగా మూడు చిరుత పులులు(Three leopards) బంధించి అటవీ శాఖ సిబ్బంది, వాటిని సమీపంలోని అడవుల్లో వదిలిపెట్టారు. పాపనాశం రేంజ్‌ పరిధిలోని వెంబయాపురం, దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత పులులు, ఆ ప్రాంత ప్రజలు పెంచుకుంటున్న మేకలు, వీధి కుక్కలను(Goats and stray dogs) హతమారుస్తున్నాయి.

Chennai: ఎట్టకేలకు పట్టుబడిన మూడో చిరుత..

చెన్నై: తిరునల్వేలి జిల్లా పాపనాశం అటవీ రేంజ్‌ పరిధిలో వరుసగా మూడు చిరుత పులులు(Three leopards) బంధించి అటవీ శాఖ సిబ్బంది, వాటిని సమీపంలోని అడవుల్లో వదిలిపెట్టారు. పాపనాశం రేంజ్‌ పరిధిలోని వెంబయాపురం, దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత పులులు, ఆ ప్రాంత ప్రజలు పెంచుకుంటున్న మేకలు, వీధి కుక్కలను(Goats and stray dogs) హతమారుస్తున్నాయి. ఈ చిరుతలతో ఎప్పుడు దాడి చేస్తాయో అని ఆ ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు.

ఇదికూడా చదవండి: Mallikarjuna Kharge : అయోధ్యపై బుల్డోజర్‌ అబద్ధం

nani2.2.jpg


ఈ నేపథ్యంలో, చిరుత పులులను బంధించేందుకు వెంబయాపురం సహా పలు ప్రాంతాల్లో అటవీ శాఖ సిబ్బంది ఇనుప బోనులు ఏర్పాటుచేశారు. ఈ నెల 17వ తేది వెంబయాపురంలో ఏర్పాటుచేసిన బోనులో ఓ చిరుత పులి చిక్కింది. అలాగే, మంగళవారం ఆనవన్‌ జనావాస ప్రాంతంలో మరో చిరుత బోనులో చిక్కింది. ఈ నేపథ్యంలో, వెంబయాపురంలో ఏర్పాటుచేసిన బోనులో మరో చిరుత చిక్కడాన్ని బుధవారం ఉదయం అటవీ సిబ్బంది గమనించారు. ఈ చిరుతలను సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలినట్లు అధికారులు తెలిపారు.

ఇదికూడా చదవండి: Calcutta High Court : బెంగాల్లో ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 23 , 2024 | 11:36 AM