Share News

Chennai: త్వరలో ప్రధాని మోదీ సహా 18మంది కేంద్ర మంత్రుల ప్రచారం

ABN , Publish Date - Mar 23 , 2024 | 11:25 AM

ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) బీజేపీ కూటమి తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిత్రపక్షాలకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకు మరో నాలుగుసార్లు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Chennai: త్వరలో ప్రధాని మోదీ సహా 18మంది కేంద్ర మంత్రుల ప్రచారం

చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) బీజేపీ కూటమి తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిత్రపక్షాలకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకు మరో నాలుగుసార్లు రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పోటీ చేయనున్న కోయంబత్తూర్‌, కేంద్ర సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ పోటీ చేయనున్న నీలగిరి నియోజకవర్గాల్లో ప్రధానితో పాటు నిర్మలా సీతారామన్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా సహా 18 మంది కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొంటారని కమలాలయం పేర్కొంది. మాజీ గవర్నర్‌ తమిళిసైకు మద్దతుగా దక్షిణ చెన్నై సహా వేలూరు, పెరంబలూరు తదితర నియోజకవర్గాల్లో కూడా కేంద్రమంత్రులు మూడు రోజులు మకాం వేసి ప్రచారంలో పాల్గొంటారు.

Updated Date - Mar 23 , 2024 | 11:25 AM