Share News

Cancellation of trains: 29 నుంచి తిరుపతి - కాట్పాడి రైళ్ల రద్దు

ABN , Publish Date - Jan 11 , 2024 | 08:53 AM

గుంతకల్‌ డివిజన్‌లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా ఈనెల 29 నుంచి మార్చి 3వ తేది వరకు ప్యాసింజర్‌, మెమో రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

Cancellation of trains: 29 నుంచి తిరుపతి - కాట్పాడి రైళ్ల రద్దు

పెరంబూర్‌(చెన్నై): గుంతకల్‌ డివిజన్‌లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా ఈనెల 29 నుంచి మార్చి 3వ తేది వరకు ప్యాసింజర్‌, మెమో రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

- నెం.07659 తిరుపతి-కాట్పాడి ప్యాసింజర్‌రైలు ఈనెల 29 నుంచి మార్చి 3వ తేది వరకు పూర్తిగా రద్దు.

- నెం.07582 కాట్పాడి-తిరుపతి ప్యాసింజర్‌రైలు ఈనెల 29 నుంచి మార్చి 3వ తేది వరకు పూర్తిగా రద్దు.

- నెం.06417 కాట్పాడి-జోలార్‌పేట మెమోస్పెషల్‌ ఈ నెల 29 నుంచి మార్చి 3వ తేది వరకు పూర్తిగా రద్దు.

- నెం.06418 జోలార్‌పేట-కాట్పాడి మెమో స్పెషల్‌ ఈ నెల 29 నుంచి మార్చి 3వ తేది వరకు పూర్తిగా రద్దు.

పాక్షిక రద్దు

- నెం.16854 విల్లుపురం - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 29వ తేది నుంచి మార్చి 3వ తేది వరకు తిరుపతికి బదులుగా కాట్పాడి వరకు మాత్రమే నడుస్తుంది.

- నెం.16853 తిరుపతి - విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 29 నుంచి మార్చి 3వ తేది వరకు తిరుపతికి బదులుగా కాట్పాడి నుంచి బయల్దేరుతుంది.

Updated Date - Jan 11 , 2024 | 08:53 AM