BJP: రేపు రాష్ట్రంలోనూ సెలవు ప్రకటించాలి
ABN , Publish Date - Jan 21 , 2024 | 01:37 PM
రాష్ట్రంలో సోమవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని కోరింది.
![BJP: రేపు రాష్ట్రంలోనూ సెలవు ప్రకటించాలి](https://media.andhrajyothy.com/media/2023/20231205/nani4_8a90c842fc.jpg)
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో సోమవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని కోరింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో నిర్మించిన రామాలయ కుంభాభిషేకం వేడుకలు ఈనెల 22వ తేది ప్రారంభంకానున్నాయి. కుంభాభిషేకం సందర్భంగా ఈనెల 22న సోమ వారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సగం రోజు సెలవును కేంద్రప్రభుత్వం ప్రకటించింది. బీజేపీ పాలిత 10 రాష్ట్రాల్లో కూడా సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోనూ సోమవారం ప్రభుత్వం సెలవు రోజుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.