Share News

Arunachal Pradesh Assembly Election: అరుణాచల్‌లో బీజేపీ 'హ్యాట్రిక్'

ABN , Publish Date - Jun 02 , 2024 | 05:36 PM

ముఖ్యమంత్రి పేమా ఖండూ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో అధికారం నిలబెట్టుకుంది. ఆదివారంనాడు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 60 నియోజకవర్గాల్లో 46 స్థానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 2019లో సాధించిన 41 స్థానాల రికార్డను కూడా బద్ధలుకొట్టింది.

Arunachal Pradesh Assembly Election: అరుణాచల్‌లో బీజేపీ 'హ్యాట్రిక్'

ఇటానగర్: ముఖ్యమంత్రి పేమా ఖండూ (Pema Khandu) సారథ్యంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం వరుసగా మూడోసారి అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో అధికారం నిలబెట్టుకుంది. ఆదివారంనాడు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 60 నియోజకవర్గాల్లో 46 స్థానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 2019లో సాధించిన 41 స్థానాల రికార్డను కూడా బద్ధలుకొట్టింది.

Sikkim Assembly Elections: సిక్కింలో ఎస్‌కేఎం విజయభేరి, రెండీ సీట్లలోనూ నెగ్గిన సీఎం ప్రేమ్‌ సింగ్


కాగా, ఆదివారంనాడు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) 5 సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) 3 సీట్లు, పీపుల్స్ పార్టీ అరుణాచల్ 2 సీట్లు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లు ఎలాంటి పోటీ లేకుండా ముందుగానే గెలిచింది.

For Latest News and National News click here..


అరుణాచల్ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తిరిగి ప్రజలు పట్టం కట్టడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీపై చెక్కుచెదరని విశ్వాసం కనబరిచిన రాష్ట్ర ప్రజలకు ఒక ట్వీట్‌లో కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం రెట్టించిన ఉత్సాహంపై పార్టీ పనిచేస్తుందని పునరుద్ఘాటించారు.

Updated Date - Jun 02 , 2024 | 05:46 PM