Share News

Swati Maliwal: దాడి జరిగినప్పుడు కేజ్రీవాల్ అక్కడే ఉన్నారు..

ABN , Publish Date - May 23 , 2024 | 08:39 PM

ప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన కేజ్రీవాల్‌ను కలిసేందుకు వచ్చిన సమయంలో తనపై బిభవ్ కుమార్ విచక్షణరహితంగా దాడి చేశారని గుర్తుచేశారు.

Swati Maliwal: దాడి జరిగినప్పుడు కేజ్రీవాల్ అక్కడే ఉన్నారు..
Swati Maliwal:

ఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ (Swati Maliwal) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన కేజ్రీవాల్‌ను కలిసేందుకు వచ్చిన సమయంలో తనపై బిభవ్ కుమార్ విచక్షణరహితంగా దాడి చేశారని గుర్తుచేశారు. ఆ సమయంలో కేజ్రీవాల్ అక్కడే ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. బిభవ్ కుమార్ తనపై దాడి చేస్తోండగా ఏ ఒక్కరు కూడా ఆపేందుకు ప్రయత్నించలేదని వాపోయారు. దాడి జరిగిన తర్వాత ఇప్పటికీ తనను కేజ్రీవాల్ కలువలేదని, ఏం జరిగిందని అడగలేదని పేర్కొన్నారు. తనపై దాడి చేసిన బిభవ్ కుమార్‌ను ఇప్పటికీ కేజ్రీవాల్ రక్షిస్తున్నారని మండిపడ్డారు. తన గురించి తప్పుగా ప్రచారం చేయాలని పార్టీలోని ప్రతి ఒక్కరికీ చెప్పారని పేర్కొన్నారు.


ఏం జరిగిందంటే..?

‘మే 13వ తేదీన ఉదయం 9 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లాను. కేజ్రీవాల్ ఇంట్లో ఉన్నారు.. వస్తారని, అప్పటి వరకు డ్రాయింగ్ రూమ్‌లో కూర్చొవాలని కేజ్రీవాల్ సిబ్బంది తనకు చెప్పారు. ఆ వెంటనే బిభవ్ కుమార్ వచ్చాడని వివరించారు. తన చెంపపై 8 సార్లు గట్టిగా కొట్టాడు. అతని తోసేందుకు ప్రయత్నిస్తే అతను నా కాలు పట్టుకుని లాగాడు. దాంతో కింద పడిపోయాను. నా తల టేబుల్‌కు తగిలింది. తర్వాత కంటిన్యూగా తనను తన్నడం ప్రారంభించాడు అని’ స్వాతి మాలివాల్ వివరించారు. తనపై బిభవ్ కుమార్ దాడి చేస్తుంటే ఆపాలని, సాయం చేయాలని గట్టిగా అరిచా.. అయినప్పటికీ ఏ ఒక్కరు స్పందించలేదని గుర్తుచేశారు.



For More Latest
National News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 08:43 PM