Share News

Loksabha Polls: శివసేనలో చేరిన బాలీవుడ్ నటుడు గోవిందా

ABN , Publish Date - Mar 28 , 2024 | 05:19 PM

బాలీవుడ్ నటుడు గోవిందా ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో గల శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ సీటు నుంచి గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది.

Loksabha Polls: శివసేనలో చేరిన బాలీవుడ్ నటుడు గోవిందా

ముంబై: బాలీవుడ్ నటుడు గోవిందా ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలో గల శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ సీటు నుంచి గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది. గోవిందా 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ముంబై నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. తర్వాత 2009లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. గురువారం నాడు గోవిందా శివసేన పార్టీలో చేరారు. 2010 నుంచి 2014 వరకు 14 ఏళ్ల వనవాసం ముగిసిందని నటుడు గోవిందా ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చానని స్పష్టం చేశారు. గోవిందాకు మంచి ఫ్యాన్ పాలొయింగ్ ఉంది. లోక్ సభ ఎన్నికల వేళ ఆయన శివసేనలో చేరడం ఆ పార్టీకి బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇది కూడా చదవండి:

Lok Sabha Polls: బీహార్‌లో కాంగ్రెస్‌కు 9 సీట్లు ఇస్తామంటోన్న లాలు.. కండీషన్స్ అప్లై

Updated Date - Mar 28 , 2024 | 05:45 PM