Share News

PM Modi: అటు రష్యా, ఇటు ఉక్రెయిన్.. యుద్ధ నేల అధినేతలతో మోదీ సంభాషణ.. ఏం మాట్లాడారంటే

ABN , Publish Date - Mar 20 , 2024 | 07:02 PM

ఏడాదికిపైగా సాగుతున్న ఉక్రెయిన్ - రష్యా(Ukraine - Russia) యుద్ధ నేల అధినేతలతో ప్రధాని మోదీ(PM Modi) బుధవారం సుదీర్ఘంగా మాట్లాడారు. ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో తొలుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడి.. తరువాత ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వోలోదమిర్ జెలెన్క్సీ‌తో ఫోన్లో సంభాషించారు.

PM Modi: అటు రష్యా, ఇటు ఉక్రెయిన్.. యుద్ధ నేల అధినేతలతో మోదీ సంభాషణ.. ఏం మాట్లాడారంటే

ఢిల్లీ: ఏడాదికిపైగా సాగుతున్న ఉక్రెయిన్ - రష్యా(Ukraine - Russia) యుద్ధ నేల అధినేతలతో ప్రధాని మోదీ(PM Modi) బుధవారం సుదీర్ఘంగా మాట్లాడారు. ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో తొలుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడి.. తరువాత ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వోలోదమిర్ జెలెన్క్సీ‌తో ఫోన్లో సంభాషించారు. పీఎంవో తెలిపిన వివరాల ప్రకారం.. జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై ప్రధానంగా చర్చించినట్లు, ఉక్రెయిన్ - రష్యా యుద్ధాన్ని ఆపి దౌత్య చర్చలకు రావాలని మోదీ కోరినట్లు తెలుస్తోంది.

శాంతియుత చర్చల కోసం భారత్ ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ ప్రజలకు భారత్ చేస్తున్న మానవతా సాయాన్ని అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రశంసించారు. ఇరు దేశాలు ఎప్పటికీ పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. 2023 మేలో జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడిని కలిశారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరువురు నేతలు వ్యక్తిగతంగా భేటీ కావడం అదే తొలిసారి.

పుతిన్‌తో ఏం మాట్లాడారంటే..

జెలెన్స్కీకి ఫోన్ చేసే కంటే ముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి(Vladimir Putin) ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. అధ్యక్ష పదవికి పుతిన్ తిరిగి ఎన్నికైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ తాజా ఫోన్ కాల్ రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రష్యా ప్రజల శాంతి, పురోగతి, శ్రేయస్సును ఆకాంక్షించారు. ఇరువురు నాయకులు రానున్న రోజుల్లో భారత్, రష్యాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు.

ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ తన X అకౌంట్లో ఇందుకు సంబంధించిన పోస్ట్ చేశారు. "రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాను. రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనందుకు అభినందనలు తెలియజేశాను. రాబోయే రోజుల్లో భారత్-రష్యా ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు కలిసి పనిచేయడానికి నిర్ణయించాం" అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.


అధ్యక్ష ఎన్నికలు

TASS ఏజెన్సీ నివేదిక ప్రకారం అధ్యక్ష ఎన్నికలలో పుతిన్ అద్భుతమైన విజయం సాధించారు. 70 శాతం ఎలక్టోరల్ ప్రొటోకాల్‌ల ప్రాసెసింగ్ ఆధారంగా అత్యధికంగా 87.17 శాతం ఓట్లు సాధించి, పుతిన్ దేశ నాయకుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. రన్నరప్‌గా నిలిచిన కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి నికోలాయ్ ఖరిటోనోవ్ 4.1 శాతం ఓట్లు పొందగా, న్యూ పీపుల్ పార్టీకి చెందిన వ్లాడిస్లావ్ దావన్‌కోవ్ 4.8 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ని ఉపయోగించారు. మొదటిసారిగా దీనిని అమలు చేశారు.

పుతిన్ అధ్యక్ష వారసత్వం

వ్లాదిమిర్ పుతిన్ తిరిగి ఎన్నిక కావడం రష్యా రాజకీయాల్లో ఆయన శాశ్వత మార్క్‌ని గుర్తు చేసింది. 2000లో ప్రారంభ ఎన్నికల నుంచి నాలుగు పర్యాయాలు అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 20 , 2024 | 07:03 PM