AP Elections: అధికారంలోకి వస్తే ఆదోనిలో టమాటో ప్రాసెసింట్ యూనిట్
ABN , Publish Date - Apr 19 , 2024 | 06:17 PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ మెడలు వంచి హోదా తెస్తాం అని చెప్పాడని గుర్తుచేశారు. తర్వాత కేసుల భయంతో బీజేపీకి భయపడి ఒక్కసారి కూడా హోదా గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. ఒకవేళ రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్పష్టం చేశారు.
కర్నూలు : ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అధికారం రాక ముందు హోదా గురించి మాట్లాడిన జగన్.. ఆ తర్వాత విషయం మరచిపోయాడని విమర్శించారు. బీజేపీ మెడలు వంచి హోదా తెస్తాం అని చెప్పాడని గుర్తుచేశారు. తర్వాత కేసుల భయంతో బీజేపీకి భయపడి ఒక్కసారి కూడా హోదా గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. ఒకవేళ రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవని వివరించారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి సంజీవని అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం