Share News

Nadendla Manohar: ఏపీ ఎన్నికల ఫలితాలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:15 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించడంపై జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కూటమిపై నమ్మకంతో అద్భుతమైన విజయం అందించారని హర్షం వ్యక్తం చేశారు.

Nadendla Manohar: ఏపీ ఎన్నికల ఫలితాలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించడంపై జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కూటమిపై నమ్మకంతో అద్భుతమైన విజయం అందించారని హర్షం వ్యక్తం చేశారు. ‘‘ మా ప్రయాణంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అవినీతి రహితంగా, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పని‌ చేయాలని మా అధినేత సూచించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో దాడులు, దారుణాలు చూశాం. అన్ని‌విధాలా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. అభివృద్ధి లేకుండా, రాజధాని‌ లేకుండా చేశారు’’ అని పేర్కొన్నారు.


రైతుల కష్టం, కన్నీరుని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో జనసేన కీలక పాత్ర పోషించనుందని, ఎన్డీయే సమావేశం అనంతరం కార్యాచరణపై చర్చ చేస్తామని ఆయన వెల్లడించారు. అమరావతి, పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. మహిళలు, రైతులను కష్టపెట్టి, కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అమరావతి, పోలవరం పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లల్లో అభివృద్ధి ద్వారా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Updated Date - Jun 05 , 2024 | 12:15 PM