AP Elections: ఏపీ చరిత్రను మార్చే తరుణం ఇది: చంద్రబాబు
ABN , Publish Date - Apr 19 , 2024 | 05:25 PM
ఆలూరులో నీళ్లు లేక, కరెంట్ లెక పోవడంతో పంట ఎండిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) ధ్వజమెత్తారు. ఏపీ చరిత్ర మార్చే కీలక తరుణం ఇది అని అభిప్రాయ పడ్డారు. ప్రజాగళం కోసం ఆలూరు వచ్చిన సమయంలో ఆలూరు అదరగొట్టింది.. దద్దరిల్లిందని స్పష్టం చేశారు.
![AP Elections: ఏపీ చరిత్రను మార్చే తరుణం ఇది: చంద్రబాబు](https://media.andhrajyothy.com/media/2024/20240413/babu_034b119b3e.jpeg)
కర్నూలు: ఆలూరులో నీళ్లు లేక, కరెంట్ లెక పోవడంతో పంట ఎండిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) ధ్వజమెత్తారు. ఏపీ చరిత్ర మార్చే కీలక తరుణం ఇది అని అభిప్రాయ పడ్డారు. ప్రజాగళం కోసం ఆలూరు వచ్చిన సమయంలో ఆలూరు అదరగొట్టింది.. దద్దరిల్లిందని స్పష్టం చేశారు. ఎన్నికలకు సై అంటూ కర్నూలు జిల్లా కాలు దువ్వుతోంది.. సీమలో ప్రతి వాడ ప్రజా చైతన్యంతో సై అంటోంది. ఆలూరు ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో జరుగుతోన్న బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం