Share News

Encounter: ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోలు మృతి..రివేంజ్ తీర్చుకుంటారా?

ABN , Publish Date - Apr 06 , 2024 | 09:32 AM

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో(telangana chhattisgarh border) శుక్రవారం రాత్రి పోలీసులు(police), మావోయిస్టులకు(Maoists) మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌(encounter)లో ముగ్గురు మావోలు మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో మూడు తుపాకులు సహా ఇతర సామాగ్రిని గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నాయి.

Encounter: ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోలు మృతి..రివేంజ్ తీర్చుకుంటారా?
Three Maoists were killed at Karriguttalu

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో(telangana chhattisgarh border) శుక్రవారం రాత్రి పోలీసులు(police), మావోయిస్టులకు(Maoists) మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌(encounter)లో ముగ్గురు మావోలు మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో మూడు తుపాకులు సహా ఇతర సామాగ్రిని గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నాయి. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అడవుల్లో(forest) ఉన్నారన్న పక్కా సమాచారం తెలుసుకుని ప్రత్యేక పోలీసు బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆ క్రమంలో అప్రమత్తమైన మావోయిస్టులు పోలీసులపై ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పులో(firing) ముగ్గురు మావోలు మరణించారు.


ములుగు జిల్లా(mulugu district) వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రిగుట్టలు-ఛత్తీస్‌గఢ్‌ పూజారి కాంకేర్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని పోలీసులతోపాటు సరిహాద్దు ప్రాంతాల్లోని సిబ్బందిని కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ముగ్గురు మావోలు మృత్యువాత చెందిన నేపథ్యంలో వారు మళ్లీ ఏదైనా ఎటాక్ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల వేళ మావోలు ఏదైనా మళ్లీ ప్లాన్ చేసి రివేంజ్ తీర్చుకుంటే ఎలా అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.


కేసీఆర్‌ కుటుంబానికి రూ.2లక్షల కోట్ల ఆస్తులున్నాయ్‌!

నేడు వడగాలులు.. రేపు వర్షాలు


మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 06 , 2024 | 09:33 AM