Share News

Bengaluru: ప్రియుడితో పార్క్‌కి వెళ్లిన అమ్మాయి.. వెనకాలే ఫాలో అయిన తల్లి.. ఆ తర్వాత జరిగింది చూసి..

ABN , Publish Date - Apr 21 , 2024 | 01:37 PM

కర్ణాటకలోకి బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని పొడిచి చంపుతుండగా.. అప్పుడు పార్క్‌కి చేరుకున్న తల్లి ఆమెని కాపాడబోయి నిందితుడ్ని హతమార్చింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే..

Bengaluru: ప్రియుడితో పార్క్‌కి వెళ్లిన అమ్మాయి.. వెనకాలే ఫాలో అయిన తల్లి.. ఆ తర్వాత జరిగింది చూసి..
Shocking Incident Happened In Bengaluru

కర్ణాటకలోకి బెంగళూరులో (Bengaluru) ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని పొడిచి చంపుతుండగా.. అప్పుడు పార్క్‌కి చేరుకున్న తల్లి ఆమెని కాపాడబోయి నిందితుడ్ని హతమార్చింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, ఆ మహిళను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ జంట హత్యల వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


కుండలోని నీరు తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

బెంగళూరులోని ఒక కంపెనీలో సురేశ్ (Suresh), అనూష (Anusha) కలిపి పని చేశారు. ఆ కంపెనీలో పరిచయం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే వీళ్లు ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే.. సురేష్‌కి అప్పటికే పెళ్లి అయిపోయింది. ఈ విషయాన్ని అతడు దాచిపెట్టి.. అనూషతో ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఫైనల్‌గా సురేష్ పెళ్లి రహస్యం అనూషకి తెలిసింది. దీంతో.. అతనితో గొడవకి దిగింది. తనని మోసం చేసినందుకు సురేశ్‌తో సంబంధాలు తెంచుకుంది. అతడ్ని పూర్తిగా దూరం పెట్టింది. ఈ క్రమంలోనే సురేశ్ ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. అనూషని హతమార్చాలని నిర్ణయించుకొని, ఓ పన్నాగం పన్నాడు. తనతో మాట్లాడాలని ఉందని, జైనగర్‌లోని సరక్కి పార్క్‌కు రావాలని ఆమెని పిలిపించాడు. అతనికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యి.. అనూష పార్క్‌కి వెళ్లింది.

హార్దిక్ పాండ్యాకు ఆ సమస్య.. విరుచుకుపడ్డ స్టార్

అయితే.. తాను పార్క్‌కి వెళ్లడానికి ముందు, తాను ఒకరిని కలవడానికి వెళ్తానని అనూష తన తల్లికి చెప్పింది. తల్లికి అనుమానం రావడంతో.. ఆమె అనూషను అనుసరించి పార్కుకు వెళ్లింది. సురేశ్ ప్రేమగా మాట్లాడుతూనే.. తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అనూషపై దాడి చేశాడు. ఇది చూసిన తల్లి.. తన కుమార్తెని కాపాడుకునే ప్రయత్నం చేసింది. అప్పుడే పక్కన ఉన్న రాయి తీసుకొని.. సురేశ్ తలపై గట్టిగా బాదింది. అతనికి తీవ్ర గాయం కావడంతో.. సురేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అటు.. తీవ్రంగా గాయపడిన అనూషని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు.. ఈ ఘటనకు సంబంధించి రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 21 , 2024 | 01:37 PM