కుండలోని నీరు తాగితే..  ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

సమ్మర్ వచ్చిందంటే.. ఫ్రిడ్జ్ నీరు తాగేందుకు చాలామంది ఇష్టపడతారు. కానీ.. దాని బదులు కుండలో నీరు తాగితే చాలా లాభాలు ఉన్నాయి.

మట్టితో తయారైన మట్టికుండలు నీటిని నిల్వ చేయడానికి చాలా మంచివి. ఈ కుండల్లోని నీరు తాగితే.. ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

మట్టకుండలో నీరు సహజంగానే చల్లబడుతుంది. ఫ్రిడ్జ్ నీరు కంటే ఇది చాలా బెటర్. ఈ నీరు తాగితే.. వేడి చేయడం వంటి సమస్యలు రావు.

కుండలని బంకమట్టితో చేస్తారు. ఇది ఆల్కలీన్ కాబట్టి, నిల్వ చేసిన నీటి pH లెవల్స్ కంటే బ్యాలెన్డ్స్‌గా ఉంటుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు రావు. 

నీటిలో సహజ సిద్ధమైన ఖనిజాలుంటాయి. అలాంటిది.. మట్టికుండలో నీరు తాగితే జీవక్రియ పెరుగుతుంది. బరువు తగ్గే ఛాన్స్ ఉంది.

మట్టికుండలోని నీరు తాగితే.. ఇందులోని సహజ ఖనిజాలు ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. మలబద్ధకం, కంటి సమస్యలు వంటివి దూరమవుతాయి.

రిఫ్రిజిరేటర్స్‌లోని నీళ్లు తాగితే.. గొంతు సమస్యలు వస్తాయి. కానీ.. మట్టికుండలోని నీరు తాగితే, గొంతు సమస్యలేమీ దరిచేరవు.

రిఫ్రిజిరేటర్స్‌లోని నీళ్లు తాగితే.. గొంతు సమస్యలు వస్తాయి. కానీ.. మట్టికుండలోని నీరు తాగితే, గొంతు సమస్యలేమీ దరిచేరవు.