Share News

Hyderabad: కుటుంబ కలహాలతో వియ్యంకురాలి హత్య

ABN , Publish Date - Jun 05 , 2024 | 11:49 AM

రెండు కుటుంబాల మధ్య తలెత్తిన కలహాలు ఓ మహిళ హత్యకు దారి తీశాయి. సొంత అల్లుడి తల్లి(వియ్యంకురాలి)పై మామ సుత్తితో దాడి చేసి హతమార్చాడు. మీర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌(Meerpet Police Station) పరిధిలోని అల్మా్‌సగూడ వినాయకహిల్స్‌లో మంగళవారం ఈ సంఘటన జరిగింది.

Hyderabad: కుటుంబ కలహాలతో వియ్యంకురాలి హత్య

- అల్లుడి తల్లిపై సుత్తితో దాడి చేసిన మామ

హైదరాబాద్: రెండు కుటుంబాల మధ్య తలెత్తిన కలహాలు ఓ మహిళ హత్యకు దారి తీశాయి. సొంత అల్లుడి తల్లి(వియ్యంకురాలి)పై మామ సుత్తితో దాడి చేసి హతమార్చాడు. మీర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌(Meerpet Police Station) పరిధిలోని అల్మా్‌సగూడ వినాయకహిల్స్‌లో మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఎస్సై గోవిందుస్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తండాకు చెందిన జాతావత్‌ ప్రభు(45) డ్రైవర్‌. ఆయన తన కూతురిని అల్మా్‌సగూడలోని వినాయకహిల్స్‌లో నివసించే కొర్రె జయరామ్‌కు ఇచ్చి వివాహం చేశాడు. కొన్నాళ్లుగా రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి.

ఇదికూడా చదవండి: Hyderabad: మల్కాజిగిరిలో ఎప్పుడూ విభిన్నమైన తీర్పే...


ఈ క్రమంలో మంగళవారం ప్రభు తన భార్య శాంతితో కలిసి వినాయకహిల్స్‌లోని కూతురు ఇంటికి వచ్చారు. అక్కడ మరోసారి ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తడంతో ప్రభు తన అల్లుడి తల్లి లలితను కోపంతో నెట్టేశాడు. ఆమె కిందపడగా ఇంట్లో ఉన్న సుత్తితో ఆమెపై దాడి చేశాడు. దాంతో తలకు తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే తుది శ్వాస విడిచింది. నిందితుడు ప్రభు అక్కడి నుంచి పరారు కాగా, మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు..


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 05 , 2024 | 11:49 AM