Share News

Hyderabad: ప్రీ లాంఛ్‌ పేరుతో రూ. 15 కోట్ల మోసం...

ABN , Publish Date - May 11 , 2024 | 11:39 AM

ప్రీ లాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ. 15 కోట్ల మేర కాజేసిన మోసగాడిని సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్ట్‌ చేశారు. ఏపీలోని చిత్తూరు రేణిగుంట(Chittoor Renigunta)కు చెందిన ఒబిలి పాపన్నగారి రామచంద్రారెడ్డి మాదాపూర్‌(Madapur)లో ఉంటున్నాడు.

Hyderabad: ప్రీ లాంఛ్‌ పేరుతో రూ. 15 కోట్ల మోసం...

- నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: ప్రీ లాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ. 15 కోట్ల మేర కాజేసిన మోసగాడిని సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్ట్‌ చేశారు. ఏపీలోని చిత్తూరు రేణిగుంట(Chittoor Renigunta)కు చెందిన ఒబిలి పాపన్నగారి రామచంద్రారెడ్డి మాదాపూర్‌(Madapur)లో ఉంటున్నాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో 200 ఎకరాల్లో ఓ వెంచర్‌ను ఏర్పాటు చేశామని ప్రచారం చేసుకున్నాడు. అనుమతి లేకుండా లేఔట్‌లు వేసి, ప్రీ లాంచ్‌ పేరుతో విక్రయాలు ప్రారంభించాడు. ఈ వెంచర్‌కు సమీపంలోనే ఐటీ కారిడార్‌, రీజనల్‌ రింగ్‌ రోడ్‌ వస్తున్నాయని, ఫలితంగా భూమిరేట్లు పెరుగుతాయని ప్రచారం చేసుకున్నాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: 14 ఏళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం..

అంతేకాకుండా తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి నెలనెలా వడ్డీ చెల్లిస్తామని కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేశాడు. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారు తిరిగి అమ్మాలనుకుంటే చదరపు గజానికి రూ.10 వేల చొప్పున చెల్లిస్తానని కూడా నమ్మబలికాడు. ఇతను మరో ప్రాపర్టీస్‌ ఎండీ వీబీ గుప్తా, ఇతర మార్కెటింగ్‌ ఏజెంట్లతో కలిసి దాదాపు 50మందిని మోసం చేసి రూ.15 కోట్లు వసూలు చేశాడు. గడిచిన మూడేళ్లుగా వెంచర్‌లో అమ్మకాలు చేసినప్పటికీ ఎవరికీ డబ్బు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు నిందితుడు ఒబిలి పాపన్నగారి రామచంద్రారెడ్డిని అరెస్ట్‌ చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: పార్సిల్‌ పేరుతో బెదిరింపులు.. కోట్లు కొల్లగొడుతున్న సైబర్‌ నేరగాళ్లు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 11 , 2024 | 11:39 AM