Share News

AP Politics: రాబోయేది టీడీపీ ప్రభుత్వమే.. వంశీకి యార్లగడ్డ మాస్ వార్నింగ్

ABN , Publish Date - Mar 14 , 2024 | 09:03 PM

త్వరలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలుకెళ్లడం ఖాయమని గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkata Rao) వార్నింగ్ ఇచ్చారు. గురువారం నాడు విజయవాడ రూరల్ రామవరప్పాడులో తెలుగుదేశం కార్యాలయాన్ని ప్రారంభించారు.

AP Politics: రాబోయేది టీడీపీ ప్రభుత్వమే.. వంశీకి యార్లగడ్డ మాస్ వార్నింగ్

ఎన్టీఆర్ జిల్లా: త్వరలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలుకెళ్లడం ఖాయమని గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkata Rao) వార్నింగ్ ఇచ్చారు. గురువారం నాడు విజయవాడ రూరల్ రామవరప్పాడులో తెలుగుదేశం కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ... గన్నవరంలో పారిశ్రామిక వాడలో అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కావాలని తెలిపారు.

కొండలు , చెరువులు దోచుకోవటానికి తాను రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. చంద్రబాబు నీరు చెట్టు లాంటి పథకం ఏదన్నా పెడితే ఆ మట్టి నుంచి వచ్చే ఆదాయాన్ని గ్రామానికే ఉపయోగిస్తానని అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్లిన వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.

వంశీ ఊసలు లెక్క పెట్టుకునే రోజులు దగ్గరలోనే..: హరిబాబు

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఊసలు లెక్క పెట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని గన్నవరం తెలుగుదేశం పరిశీలకులు హరిబాబు(Haribabu) హెచ్చరించారు. వంశీ అరచాకాలను యార్లగడ్డ వెంకట్రావు వెలికి తీస్తారని అన్నారు. వంశీకి త్వరలోనే వెంకట్రావు చుక్కలు చూపిస్తారని హెచ్చరించారు. మహాకూటమితో యార్లగడ్డ వెంకట్రావు గెలుపు ఖాయమని హరిబాబు అన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 09:03 PM