Share News

Lokesh: ఇది గుర్తుపెట్టుకో అంబటి.. లోకేష్ ఆన్ ఫైర్..

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:09 PM

Andhrapradesh: సీఎం జగన్ మోహన్‌రెడ్డి పచ్చి అబద్దాల కోరు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. శనివారం శృంగవరపుకోట శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ... రాబోయే రెండు నెలల్లో జగన్‌తో రాష్ట్ర ప్రజలు ఫుట్ బాల్ ఆడుకోబోతున్నారన్నారు.

Lokesh: ఇది గుర్తుపెట్టుకో అంబటి.. లోకేష్ ఆన్ ఫైర్..

విజయనగరం, ఫిబ్రవరి 17: సీఎం జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) పచ్చి అబద్దాల కోరు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) వ్యాఖ్యలు చేశారు. శనివారం శృంగవరపుకోట శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ... రాబోయే రెండు నెలల్లో జగన్‌తో రాష్ట్ర ప్రజలు ఫుట్ బాల్ ఆడుకోబోతున్నారన్నారు. ‘‘అరగంట అంబటి చాలా బాధపడుతున్నారు.. రాష్ట్ర సింహాసనంపై శునకం కూర్చుంది. అంబటి గుర్తుపెట్టుకో’’ అంటూ కామెంట్స్ చేశారు. ప్రజల కన్నీళ్ల చూసిన చంద్రబాబు సూపర్ 6 పథకాలు పెట్టబోతున్నారని తెలిపారు.

వైసీపీకి అభ్యర్ధులు దొరకటం లేదని అన్నారు. అభివృద్ధి కోట శృంగవరపుకోటని అవినీతి కోటగా ఎమ్మెల్యే కడుబండి మార్చేశారని ఆరోపించారు. కరోనా సమయంలో స్ధానిక పరిశ్రమల యాజమాన్యాలు నుంచి ఎమ్మెల్యే కడుబండి భారీగా కలెక్షన్లు చేశారన్నారు. అవినీతి సామ్రాట్ జగన్‌కు తానేమీ తక్కువ కాదన్న రీతిలో ఎమ్మెల్యే కడుబండి అవినీతి డబ్బు యాభై కోట్లతో ప్యాలెస్ నిర్మించుకుంటున్నారని లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 17 , 2024 | 12:50 PM