Share News

Lokesh: మీ కుర్చీలు మేం మడతపెడతాం.. జగన్‌కు లోకేష్ కౌంటర్

ABN , Publish Date - Feb 16 , 2024 | 12:42 PM

Andhrapradesh: ‘‘భూం భూం బ్యాచ్ షర్ట్‌లు మడతపెడితే మీ కుర్చీలు మేం మడతపెడతాం’’ అంటూ కూర్చీని మడతపెట్టి చూపించారు నారా లోకేష్. శుక్రవారం నెల్లిమర్ల శంఖారాం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Lokesh: మీ కుర్చీలు మేం మడతపెడతాం.. జగన్‌కు లోకేష్ కౌంటర్

విజయనగరం, ఫిబ్రవరి 16: ‘‘భూం భూం బ్యాచ్ షర్ట్‌లు మడతపెడితే మీ కుర్చీలు మేం మడతపెడతాం’’ అంటూ కూర్చీని మడతపెట్టి చూపించారు నారా లోకేష్. శుక్రవారం నెల్లిమర్ల శంఖారాం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అమ్మలాంటిదని.. ఈ ప్రాంత ప్రజలకు కష్టపడటం తప్ప మాయమర్మాలు తెలియవన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ మచ్చ తేవాలనుకున్నారని.. ప్రపంచం అంతా చంద్రబాబు అభిమానులు ఎంత మంది ఉన్నారో జగన్ కుట్రతో తేలిపోయిందన్నారు. రాజధాని రైతులను చూస్తే జగన్‌కు ప్యాంట్ తడిచిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు.

‘‘నేను జగన్ అంటే మీరంతా సైకో జగన్ అంటున్నారేంటి. రాష్ట్రంలో వైసీపీ అంతా బ్లేడు బ్యాచీయే. ఉన్న రాజధానిని చెడగొట్టి మరో రెండేళ్లు హైదరాబాద్‌లో కులుకుతామంటున్నారు. సిగ్గుందా మీకు. దమ్ముందా జగన్ మీరు పెట్టిన భూం భూం షాపులు దగ్గరకు వెళదాం.. అక్కడున్నవారు మీ గురించి ఏం చెబుతున్నారో విందాం’’ అంటూ సవాల్ విసిరారు. ఊర్లో ఉన్న అందరినీ తాగుబోతులను చేయటమే జగన్ ధ్యేయమన్నారు. మరో రెండు నెలల్లో జగన్‌కు షాక్ తప్పదన్నారు. యువత దగ్గరకు వెళ్లే దమ్ముందా జగన్ అని ప్రశ్నించారు. ‘‘రాజధాని ఫైల్స్’’ సినిమా పేరెత్తితే జగన్ సుస్సు పోసుకుంటున్నారంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 16 , 2024 | 12:48 PM