Share News

Ganta Srinivasa Rao: ‘ఇప్పుడు అనండి వైనాట్ 175’.. జగన్‌పై గంటా సెటైర్లు

ABN , Publish Date - Feb 14 , 2024 | 06:11 PM

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సెటైర్లు గుప్పించారు. వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడుతారని.. వైనాట్ 175 అని ఇప్పుడనమనండి చుద్దామని ఎద్దేవా చేశారు.

Ganta Srinivasa Rao: ‘ఇప్పుడు అనండి వైనాట్ 175’.. జగన్‌పై గంటా సెటైర్లు

విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సెటైర్లు గుప్పించారు. వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడుతారని.. వైనాట్ 175 అని ఇప్పుడనమనండి చుద్దామని ఎద్దేవా చేశారు. ‘‘మీ వెన్నుముకలు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏమి కావాలి జగన్. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పార్లమెంట్‌లో ఉన్న మీ 22+8 మంది ఎంపీలు ఎందుకు మీకు మొహం చాటేశారు. ఎమ్మెల్యేలు,, ఎమ్మెల్సీలు మొహం చాటేశారు సరైన కోరం లేక అసెంబ్లీ వాయిదా పడింది.. చివరి అసెంబ్లీ గ్రూప్ ఫొటో కూడా దిగలేని దుస్థితి ఉంది. న‌మ్ముకున్న వారితోనే న‌ట్టేట మునిగామ‌ని ప్రతి వైసీపీ నాయకుడు అంత‌ర్మథనంలో పడిపోయారు. వైసీపీ నేత‌లకు తత్వం బోధ పడింది. మునిగిపోతున్న వైసీపీ ప‌డ‌వ నుంచి ఒక్కొక్కరూ దూకేస్తున్నారు. సొంత పార్టీ నేతలే, మీ టికెట్ వద్దు... మీరు వద్దు... అని చీ కొట్టి పోతున్నారు’’ అని గంటా శ్రీనివాసరావు సెటైర్లు వేశారు.

Updated Date - Feb 14 , 2024 | 07:35 PM