Share News

Anitha: విశాఖ సంఘటన అమానుషం: వంగలపూడి అనిత

ABN , Publish Date - Jan 02 , 2024 | 02:05 PM

విశాఖ: నగరంలో జరిగిన సంఘటన అమానుషమని.. మాట్లాడితే ‘‘సిఎం జగన్...నా ఆడ బిడ్డలు, నా అక్క చెల్లెలు అంటారు.. కానీ వారికి రక్షణ కల్పించలేకపోతున్నారు.. నాలుగునరేళ్లుగా మహిళాలపై యదేచ్ఛగా అఘాత్యాలుజరుగుతున్నాయి..’’ అంటూ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.

Anitha: విశాఖ సంఘటన అమానుషం: వంగలపూడి అనిత

విశాఖ: నగరంలో జరిగిన సంఘటన అమానుషమని.. మాట్లాడితే ‘‘సిఎం జగన్...నా ఆడ బిడ్డలు, నా అక్క చెల్లెలు అంటారు.. కానీ వారికి రక్షణ కల్పించలేకపోతున్నారు.. నాలుగునరేళ్లుగా మహిళాలపై యదేచ్ఛగా అఘాత్యాలుజరుగుతున్నాయి..’’ అంటూ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో లక్ష 48 వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయని, మహిళల అఘాత్యాలపై ఏపి మూడవ స్థానంలో ఉందన్నారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్, ప్రతిపక్షాలు మాట్లాడితే కేసులు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు, ఆడ పిల్లలకు రక్షణ లేదని, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన దళిత బాలికపై 11 మంది గ్యాంగ్ రేప్ చేశారని, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంలో దళిత హోంమంత్రి ఎందుకు స్పందించరని అనిత నిలదీశారు.

ఇంత ఘోరం జరిగినా మహిళా కమిషన్ చైర్ పర్సన్ విశాఖకు ఎందుకు రాలేదు..? బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించరని అనిత ప్రశ్నించారు. ఇప్పుడే నిద్ర లేచి... సుమోటోగా కేసు స్వీకరిస్తామని అంటున్నారని, కేసును పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని మండిపడ్డారు. ఏపిలో రోజు రోజుకూ మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి ఘటనలపై డీజీపీ ఎందుకు స్పందించడం లేదన్నారు. గన్ కంటే ముందు జగన్ వస్తారని జబర్దస్త్ డైలాగ్ కొట్టేవారు ఎక్కడ ఉన్నారని మంత్రి రోజాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అందరి చేత డౌన్ లోడ్ చేయించారు కదా? దిశ యాప్ ఏమైందని అనిత నిలదీశారు.

మూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం పోతుందని అనిత అన్నారు. మహిళా రక్షణ కోసం భారతీ రెడ్డి ముందుకు రావాలన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న ఆర్జివీపై ఎందుకు కేసులు పెట్టడం లేదు?.. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు పెడతారని మండిపడ్డారు. భాదిత కుటుంబాన్ని తాము పరామర్శిస్తామంటే.. వివరాలు పోలీసులు ఇవ్వడం లేదని, మీడియాను కూడా పోలీసులు తప్పు త్రోవ పట్టిస్తున్నారని వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 02 , 2024 | 02:05 PM