Share News

Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. టీడీపీకి వచ్చే సీట్లు ఎన్నంటే!

ABN , Publish Date - Apr 09 , 2024 | 12:43 PM

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన పంచాగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు.

Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. టీడీపీకి వచ్చే సీట్లు ఎన్నంటే!

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన పంచాగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు.

బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ పంచాగ శ్రవణం నిర్వహించారు. అద్వితీయమైన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పయని స్తుందన్నారు. కర్కాటక రాశికి చెందిన చంద్రబాబు నాయుడి ప్రతిష్ట రానున్న కాలంలో మరింత పెరుగుతుందన్నారు. జాతకరీత్యా ప్రజల సొంత గృహ కళ నెరవేర్చేశక్తి చంద్రబాబుకు ఉందన్నారు. అమరావతి నూతన రాజధానిగా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని మాచిరాజు వేణుగోపాల్ తన పంచాగ శ్రవణంలో చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూటమి 128 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందుతుందన్నారు.

‘‘ చంద్రబాబుకు ఈ ఏడాది కలిసి వస్తుంది. చంద్రబాబుకు అధికార యోగం ఉంది. త్రిమూర్తులు కలయికతో ఏపీకి మేలు జరుగుతుంది. బ్రహ్మ - మోడీ, విష్ణువు - పవన్, ఈశ్వరుడు - చంద్రబాబు. చంద్రబాబు అమరావతి నిర్మాణం చేపడతారు. టీడీపీది వృశ్చిక రాశి. ఈ ఏడాది వృశ్చిక రాశి వారు అనుకున్నది సాధిస్తారు’’ అని పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ అని అన్నారు.

Pawan Kalyan: ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2024 | 01:05 PM